Anna Lezhneva: విఐపి సౌకర్యాలు ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ కోసం అన్నా లెజినోవా చేసిన పనికి అభిమానులు ఫిదా..

Published : Jul 18, 2026, 09:24 AM IST

Anna Lezhneva: పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా భర్త అడుగు జాడల్లో నడుస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. విదేశాల్లో పెరిగినా మన సంప్రదాయాలు పాటిస్తూ.. మొక్కులు చెల్లించుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. రీసెంట్ గా పవన్ కోసం ఆమె ఏం చేసిందంటే?

PREV
14
శ్రీవారికి మొక్కు చెల్లించుకున్న పవన్ సతీమణి

భర్త క్షేమం, కుటుంబ సౌఖ్యం కోసం భారతీయ సంప్రదాయంలో మహిళలు చేసే పూజలు, వ్రతాలకు ఎంతో ఇంపార్టెన్స్  ఉంది. తాజాగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా సైతం తన భర్త ఆరోగ్యం కోసం శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ అన్నా లెజ్‌నేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

24
విఐపి సౌకర్యాలు ఉన్నా తీసుకోలేదు..

ఈ పర్యటనలో ఆమె భక్తిశ్రద్ధలు అందరినీ ఆకట్టుకున్నాయి. విఐపి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆమె సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గాన్ని ఎంచుకున్నారు. కాలినడకన కొండపైకి చేరుకునేందుకు అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్లారు. భక్తితో, ఓపికతో మెట్లు ఎక్కుతూ శ్రీవారి చెంతకు చేరుకున్నారు. తిరుమల కొండపైకి చేరుకున్న అనంతరం, సాంప్రదాయం ప్రకారం చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆమె నేరుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల సాంప్రదాయం ప్రకారం శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ, దానిని ఆమె నిష్ఠగా పాటించారు.

34
కుటుంబం కోసం రెండో సారి..

అన్నా లెజ్‌నేవాకు శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గతంలో వారి కుమారుడు చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుండి వారి కుమారుడు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సమయంలో కొడుకు ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా అన్నా లెజ్‌నేవా అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి, శ్రీవారికి తన తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.

44
విదేశీ సంస్కృతిలో పెరిగినప్పటికీ

విదేశీ సంస్కృతిలో పెరిగినప్పటికీ, అన్నా లెజ్‌నేవా భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, ఇక్కడి పూజా విధానాలను ఎంతగానో గౌరవిస్తారు. తాజాగా భర్త పవన్ కళ్యాణ్ సర్జరీ అనంతరం ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆమె చేసిన ఈ కాలినడక ప్రయాణం ,తిరుమల యాత్ర సోషల్ మీడియాలో , అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచింది. భర్తపై ఆమెకున్న ప్రేమకు, తపనకు ఈ యాత్ర నిదర్శనంగా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories