పవిత్ర లోకేష్ గతంలో హీరోయిన్ గా రాణించారు. కన్నడ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేశారు. ఓ చిత్రంలో పవిత్ర లోకేష్ ఏకంగా ఐటెం సాంగ్ లో కూడా మెరిశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నటి పవిత్ర లోకేష్ గురించి పరిచయం అవసరం లేదు. గతంలో ఆమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. పవిత్ర లోకేష్ గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు సుచేంద్ర నుంచి కూడా పవిత్ర లోకేష్ విడిపోయింది.
25
నరేష్ తో పవిత్ర లోకేష్ పెళ్లి
ఆ తర్వాత ఆమె తెలుగు నటుడు నరేష్ తో రిలేషన్ షిప్ మొదలుపెట్టడం తీవ్ర వివాదం అయిన సంగతి తెలిసిందే. మీడియాలో పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి. కానీ చివరకు నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పవిత్ర లోకేష్ దశాబ్దాలుగా నటిగా రాణిస్తున్నారు. ఇప్పుడంటే ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు కానీ గతంలో కన్నడలో అనేక చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా రాణించారు.
35
పవిత్ర లోకేష్ చేసిన ఐటెం సాంగ్
ప్రస్తుతం తల్లి, అత్త, వదిన పాత్రలు చేస్తున్న పవిత్ర లోకేష్ గతంలో ఐటెం సాంగ్ కూడా చేశారని తెలుసా ? అవును ఆమె ఓ కన్నడ చిత్రంలో అదిరిపోయే ఐటెం సాంగ్ చేశారు. గ్లామరస్ గా కనిపిస్తూ డ్యాన్స్ తో అదరగొట్టారు. 2004లో విడుదలైన కన్నడ చిత్రం 'మోండా'లో పవిత్ర లోకేష్ చిన్న పాత్రలో మెరిసి స్పెషల్ సాంగ్ లో చిందులేశారు. ఇంతకీ ఆ మూవీలో హీరో ఎవరంటే.. డైలాగ్ కింగ్ సాయి కుమార్.
సాయి కుమార్ తెలుగులో ఎంతటి పాపులర్ నటుడో.. కన్నడలో కూడా అంతే పాపులర్. మోండా మూవీలో సాయి కుమార్ సీరియల్ కిల్లర్ గా నటించారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలని హీరో వరుసగా మర్డర్ లు చేస్తుంటాడు. ఈ మూవీలో సాయి కుమార్ అన్నయ్య పోలీస్ అధికారి. ఇంట్లో అన్న వదినలతో సాయి కుమార్ ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళల్ని హతమారుస్తుంటాడు.
55
అక్రమ సంబంధాలు పెట్టుకునే అమ్మాయిలే టార్గెట్
ఈ క్రమంలో పవిత్ర లోకేష్ తో సాయి కుమార్ కి పరిచయం ఏర్పడుతుంది. పవిత్ర లోకేష్ ని చూపించగానే ఆమె చాలా సాంప్రదాయంగా భర్తతో అన్యోన్యంగా ఉన్నట్లు చూపిస్తారు. కానీ సాయి కుమార్ ని చూడగానే ఫిదా అయిపోతుంది. ఎలాగైనా అతడిని ముగ్గులోకి దించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే సాయి కుమార్, పవిత్ర లోకేష్ మధ్య అదిరిపోయే ఐటెం సాంగ్ వస్తుంది. 'బారో వీర జోకుమార' అనే ఈ పాటలో పవిత్ర లోకేష్ గ్లామర్ ఒలకబోసింది. ఆ తర్వాత ఆమెని కూడా సాయి కుమార్ చంపేస్తారు. చివరికి సాయి కుమార్ అన్నయ్యకి డౌట్ వస్తుంది. సాయి కుమార్ ని పట్టుకునేందుకు తన వదినతోనే ట్రాప్ లోకి దించుతారు. ఆ విధంగా సాయి కుమార్ దొరికిపోతాడు. కథ థ్రిల్లింగ్ గా ఉన్నప్పటికీ ఈ చిత్రం విజయం సాధించలేదు.