
ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన `వార్ 2` సినిమా మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తారక్తోపాటు హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అయితే అంతకు ముందు ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ చెప్పిన మాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
కానీ థియేట్రికల్ బిజినెస్ మాత్రం గట్టిగానే జరిగింది. ఈ సినిమా థియేటర్ హక్కులు ఎంత ధర పలికాయి. ఏఏ భాషలో ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాయనేది చూస్తే. తెలుగు స్టేట్స్ లో రూ.90కోట్లకు అమ్ముడు పోయాయి. నిర్మాత నాగవంశీ ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు స్టేట్స్ లో ఏరియా వైజ్ చూస్తే, నైజాం రూ.36.50కోట్లు, సీడెడ్ రూ.18కోట్లు, ఆంధ్ర రూ.36 కోట్లకు అమ్ముడు పోయింది. అలాగే హిందీలో రూ.150కోట్ల ధర పలికింది. ఇండియాలోని ఇతర స్టేట్స్ అన్నీ కలిపి రూ.23కోట్లు పలికినట్టు సమాచారం. ఓవర్సీస్లో రూ.102 కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది. ఈ లెక్కన `వార్2` థియేటర్ హక్కులు రూ.365కోట్ల ధర పలికిందని సమాచారం.
`వార్ 2` సినిమాకి సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యింది. అందులో థియేట్రికల్గానే రూ.365కోట్లు వచ్చింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ అయితే అది పెద్ద సమస్య కాదు. లేదంటే పెద్ద నష్టాలే. నిర్మాతలకు నష్టం లేదు. ఎందుకంటే థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రూపంలో పెట్టిన బడ్జెట్ వచ్చేసింది. ఇంకా లాభాల్లోనే ఉంది. కానీ బయ్యర్లకే ఇబ్బంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే `వార్ 2` మూవీ థియేట్రికల్ బిజినెస్ `కూలీ`ని మించి జరిగింది. రజనీకాంత్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.305కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.52కోట్లు పలికిందట. ఈ విషయంలో `వార్ 2`.. `కూలీ`ని మించిపోయింది. అరవై కోట్లు ఎక్కువగానే రాబట్టింది.
`వార్ 2` విషయంలో ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి ఎన్టీఆర్, హృతిక్ రిక్వెస్ట్ చేశారు. స్పాయిలర్స్ లీక్ చేయోద్దని తెలిపారు. ‘`వార్ 2` సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్లను రివీల్ చేయకండి.. స్పాయిలర్లను ఆపండి.. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు. ‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి` అని ఎన్టీఆర్ తెలిపారు.