`ఈ రోజు సాయంత్రం NTR భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని తెలియజేయడానికి చింతిస్తున్నాము. క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం, ఆయన పూర్తిగా, సజావుగా కోలుకునేందుకు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తారక్ ఆరోగ్యం, కోలుకునేదానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో తెలియజేస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు` అని టీమ్ వెల్లడించింది.