ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 2024లో రూపొందిన `దేవర` మూవీ దాదాపు రూ.450కోట్ల వరకు వసూలు చేసింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేశారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రుతి మరాఠే వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మించారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.