ప్రారంభంలో తెలుగు సినిమాని శాసించిన స్టార్స్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ల తర్వాత కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజులు నిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కో జోనర్లో మూవీస్ చేస్తూ రాణించారు. తమకంటూ సెపరేట్ ఇమేజ్ని, క్రేజ్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికాలు, యాక్షన్ చిత్రాలు చేశారు. మరోవైపు నాగేశ్వరరావు జానపద చిత్రాలు, ప్రేమ కథలు, ఫ్యామిలీ సినిమాలు చేశారు.
వారి తర్వాత యాక్షన్, కమర్షియల్ బాటలో కృష్ణ, కృష్ణంరాజు వెళితే, నాగేశ్వరరావు బాటలో శోభన్ బాబు వెళ్లారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ చిత్రాలకు పెద్ద పీఠ వేశారు సోగ్గాడు. అదే ఆయన సక్సెస్కి కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.