ఒక సినిమాలో హీరోకు ఎక్కువగా రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోతో పోల్చితే హీరోయిన్ రెమ్యునరేషన్ చాలా తక్కువ. కాని ఈమధ్య హీరోయిన్లు కూడా ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నారు. హీరోయన్లు ఎంత డిమాండ్ చేసినా వారి పారితోషికం 50 కోట్లు దాటడం లేదు. కాని హీరోల రెమ్యునరేషన్ మాత్ర 300 కోట్లు దాటింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లు ఉండగా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి . నయనతార, సాయి పల్లవి, త్రిష లాంటి వారు అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. సినిమాలతో పాటు ప్రకటనల్లో నటించి కోట్లు సంపాదిస్తున్నారు. సాయి పల్లవి మాత్రం ప్రకటనల్లో నటించకూడదనే నియమాన్ని పాటిస్తున్నారు.