అన్నమయ్య సినిమా కోసం ప్రాణాలకు తెగించిన నాగార్జున, ఆ ఒక్క సీన్ కోసం అంత రిస్క్ చేశాడా?

Published : Jul 15, 2025, 03:44 PM ISTUpdated : Jul 15, 2025, 03:47 PM IST

సినిమా మీద ప్రేమతో ఎంత రీస్క్ చేయడానికైనా వెనకాడని నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. ఆయనకు నటన అంటే ఎంతో ఇష్టం.. పాత్రలకోసం ప్రాణాలకు తెగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నమయ్య సినిమా కోసం నాగార్జున ఏం చేశారో తెలుసా?

PREV
15

సినిమాల్లో నటించడం అంటే ఏదో చేస్తున్నా అన్నట్టు కాదు.. అవకాశం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనే స్టార్లు అవ్వగలరు. నటనతో మెప్పించగలిగితేనే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగలరు. కొంత మంది స్టార్స్ అయితే సినిమా అంటే చాలు మైమరచిపోతుంటారు. సినిమా కోసం ఏ రిస్క్ చేయడానికైనా వెనకాడరు. ఎలాంటి ప్రయోగమైనా, ఎంత ప్రమాదం అయినా అస్సలు వెనకడుగు వేయరు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, విశాల్ లాంటి స్టార్స్ ఈ కోవలోకే వస్తారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఇలాంటి రిస్క్ షార్టు చాలా చేశారు. మరీ ముఖ్యంగా అన్నమయ్యసినిమా కోసం నాగార్జున చేసిన సాహసం అంతా ఇంతా కాదు.

25

నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అన్నమయ్య. టాలీవుడ్ మన్మధుడు, యువసామ్రాట్ గా ఉన్న నాగార్జున ఒకేసారి పరమ భక్తులు, సంకీర్తనాచార్యుడు అన్నమయ్య పాత్ర చేస్తున్నాడు అంటే అది రిస్క్ అన్నారు చాలామంది. ఆయన ఇమేజ్ కు ఆ పాత్ర సరిపోతుందా, స్టైలీష్ గా ఉండే నాగార్జున భక్తి రసం పండించగలరా అని అనుమానాలు ఉండేవి. 

కానీ అన్నమయ్య సినిమాలో అందరి అనుమానాలు పటాపంచలు చేశారు నాగ్. అసలు ఆ పాత్రకు సరిపోతాడా అని అనుమానం వ్యక్తి చేయడం కాదు.. ఆసినిమాతోనే కింగ్ కెరీర్ మరో మలుపు తిరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

35

ఒక రకంగా తిరుమల తిరుపతికి మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది అన్నమయ్య సినిమా. అన్ని పాత్రలు అద్భుతంగా సెట్ అవ్వడం. వెంకటేశ్వరుడిగా సుమన్ ను చూసి పులకరించిపోయారు భక్తులు. వాగ్గేయకారుడిగా నాగార్జున పర్ఫామెన్స్ కు 100 మార్కులు పడ్డాయి. 

ఈ సినిమాను, ఆ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని చేశారు నాగార్జున. ఇక ఈసినిమా ప్రయాణం అంత సాఫీగా సాగిపోలేదు. ఈ పాత్ర కోసం చాలా రిస్క్ లు చేశారు నాగ్. మరీ ముఖ్యం క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఈవిషయాన్ని సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో నాగార్జున, రాఘవేంద్ర రావు స్వయంగా వెల్లడించారు.

45

ఈ సినిమా క్లైమాక్స్ లో అన్నమయ్య పండు ముసలి అవుతాడు. మోక్షం కోసం దేవునితో మాట్లాడే సీన్. చాలా లెన్తీ సీన్ అది. అయితే అంత సేపు నాగార్జున వాయిస్ వణుకుతూ, ముసలి వాయిస్ రావాలి. కాని అది హీరోకు సాధ్యం అవుతందో లేదో, అతన్ని ఇబ్బందిపెట్టడం ఎందుకు అని ఎస్పీ బాలుచేత ఈసీన్ కు డబ్బింగ్ చెప్పిద్దాం అనుకున్నాడట. 

కానీ సినిమా అంతా తానే డబ్బింగ్ చెప్పి.. ఆ ఒక్క సీన్ కు వేరే వాళ్తతో చెప్పించడం ఎందుకు నేనే చెపుతాను అని నాగార్జున అన్నారట. అయితే ముసలి గొంతుతో మాట్లాడటం కింగ్ కు చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి నాగార్జున 38 ఏళ్ల యంగ్ ఏజ్ లోనే ఉన్నారు. దాంతో ఈ పాత్రకు ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలని, డబ్బింగ్ ముందు రోజు రాత్రి దాదాపు 1 కిలో వరకూ ఐస్ క్యూబ్స్ తినేశాడట.

55

సినిమాలో ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం అంత రిస్క్ చేసి కిలో ఐస్ తినేయడం అంటే అంత సులువైన విషయం కాదు. అలా ఐస్ తినడంతో మరుసడి రోజు నాగార్జున గొంతు పూర్తిగా మారిపోయింది. అప్పుడు డబ్బింగ్ చెప్పడం సులువుగా మారింది. ఇలా అన్నమయ్య సినిమా కోసం ఇలాంటి రిస్క్ లు చాలా చేశారు నాగార్జున. అంత కష్టపడ్డందుకు అన్నమయ్య సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 

ఇప్పటికీ 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ... దూసుకుపోతున్నాడు నాగార్జున. వెండితెరతో పాటు బిగ్ బాస్ లాంటి షోలతో బుల్లితెరపై కూడా నాగార్జున కింగ్ లా దూసుకుపోతున్నాడు. ఇక నాగ్ నటించిన కుబేర సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక రజనీకాంత్ తో నాగార్జున కలిసి నటించిన కూలి సినిమా రిలీజ్ కు రెడీవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories