చిరంజీవి కెరీర్ని పీక్కి తీసుకెళ్లిన చిత్రాల్లో `యముడికి మొగుడు` ఒకటి. కొంత ఫాంటసీ మేళవింపుతో ఈ చిత్రం సాగుతుంది. చిరంజీవి ఇందులో రెచ్చిపోయి యాక్ట్ చేశారు.
యాక్షన్ పరంగానూ అదరగొట్టారు. ఎమోషన్స్ పరంగానూ అలరించే మూవీ ఇది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వ వహించగా, విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో వీరి కాంబినేషన్కి యమ క్రేజ్ ఉండేది.
ఈ మూవీని డీజీ నారాయణరావు, హరిప్రసాద్, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించారు. వీరంతా చిరంజీవి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. రూమ్మేట్స్ కూడా.