పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్ కుమార్, కార్తీ ముగ్గురిలో ఎవరికీ సాధ్యం కాని కామన్ క్వాలిటీ.. నాగార్జున కామెంట్స్

First Published Oct 5, 2024, 5:48 PM IST

కింగ్ నాగార్జున ఇటీవల కొన్ని కారణాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సిట్యువేషన్ అయినా నాగార్జున చాలా తక్కువగా మాట్లాడతారు. తన పని తాను చేసుకుని వెళతాడు. అయితే నాగార్జున తక్కువగా మాట్లాడినప్పటికీ తన అభిప్రాయాలు సూటిగా చెబుతారు.

కింగ్ నాగార్జున ఇటీవల కొన్ని కారణాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సిట్యువేషన్ అయినా నాగార్జున చాలా తక్కువగా మాట్లాడతారు. తన పని తాను చేసుకుని వెళతాడు. అయితే నాగార్జున తక్కువగా మాట్లాడినప్పటికీ తన అభిప్రాయాలు సూటిగా చెబుతారు. ఓ ఇంటర్వ్యూలో నాగార్జున కొందరు స్టార్ హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. కొందరు బ్యాగ్రౌండ్ ఉండడంతో ఎలాగోలా నెట్టుకొస్తుంటారు. మరికొందరు ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే తమకి ఉన్న బ్యాగ్రౌండ్ ని ఓవర్ షాడో చేసి ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటుంటారు. అలాంటి హీరోలని వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. 

Latest Videos


Kaithi

దీని గురించి నాగార్జున మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్, కార్తీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున మాట్లాడుతూ.. తమ ఇంట్లో సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ వాళ్ళ షాడో నుంచి బయటకి వచ్చి తన సొంత క్రేజ్ నిరూపించుకోవడం చాలా కష్టం. అలా సొంత క్రేజ్ ఏర్పరుచుకున్న హీరోలు అరుదు. అలాంటి హీరోలని ఇద్దరినే చూశాను. ఇక్కడ టాలీవుడ్ లో మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కర్ణాటకలో శివన్న శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ మాత్రమే ఆ విధంగా క్రేజ్ తెచ్చుకున్నారు. 

Also Read: ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ కాదు.. స్టార్ డైరెక్టర్ వల్ల పెద్ద దెబ్బ పడింది ఆ ఒక్క హీరోకే, ఏకంగా 12 ఫ్లాపులు

Actor Karthi

ఇప్పుడు తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తీ కూడా అదే విధంగా క్రేజ్ తెచ్చుకుంటున్నాడు అంటూ నాగార్జున ఆసక్తికర  చేశారు. వీళ్లంతా వాళ్ళ బ్రదర్స్ క్రేజ్ ని ఓవర్ షాడో చేసి రాణిస్తున్నారు అని నాగార్జున తెలిపారు. నాగార్జున కార్తీ కలసి ఊపిరి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో కన్నడ చిత్రాల్లో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. కానీ అత్యంత పిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో మృతి చేసిన సంగతి తెలిసిందే. 2021లో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ కి టాలీవుడ్ రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో మంచి అనుబంధం ఉంది. 

click me!