మహానటి సావిత్రినే టాలీవుడ్ నటుడు ఒకరు అనుమానించారు. ఆమె గురించి ఆ నటుడు వెళ్లి డైరెక్టర్ అని అడిగారు. డైరెక్టర్ ఇచ్చిన సమాధానం, ఆ తర్వాత అతడు తెలుసుకున్న విషయాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి స్థాయి, స్థానం వేరు. ఎన్టీఆర్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు, స్టార్ డైరెక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా సావిత్రి తన నటనతో మెప్పించారు. నటిగా సావిత్రి ఎంత గొప్ప పేరు తెచుకున్నారో చివరి రోజుల్లో అంతగా ఆమె కష్టాలు అనుభవించారు. ఊహించని పరిస్థితుల్లో కన్నుమూశారు.
25
సావిత్రితో మురళీ మూవీ మూవీ
మహానటి సావిత్రితో తనకు ఎదురైన కొన్ని సంఘటనలని సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నాకు మహానటి సావిత్రి గారితో నటించే అవకాశం దక్కింది. దాసరి దర్శకత్వంలో భారతంలో ఒక అమ్మాయి అనే చిత్రంలో నేను, సావిత్రిగారు, చంద్రమోహన్ కలసి నటించాం. ఆ మూవీలో సావిత్రి గారు నాకు తల్లిగా నటించారు.
35
సావిత్రి గారు డైలాగ్ ఆలస్యంగా చెప్పారు
షూటింగ్ తొలి రోజే నాకు, సావిత్రి గారికి మధ్య డైలాగుల సన్నివేశంతో ప్రారంభించారు. రిహార్సల్స్ చేశాం. అంతా బాగానే ఉంది అని అనుకున్న తర్వాత షూటింగ్ మొదలు పెట్టాం. ముందుగా నా డైలాగులు చెప్పి నేను పక్కకు వచ్చేశా. నా నా డైలాగ్స్ కి రియాక్షన్ ఇస్తూ సావిత్రి గారు డైలాగ్స్ చెప్పాలి. రిహార్సల్స్ లో ఏమో చాలా వేగంగా డైలాగ్ చెప్పింది. కానీ ఇక్కడ చెప్పడం లేదు. చాలా ల్యాగ్ వచ్చింది.
ఆ తర్వాత డైలాగ్ చెప్పింది. డైరెక్టర్ గారు షాట్ ఒకే అన్నారు అందరూ చప్పట్లు కొట్టారు. ఆమె డైలాగ్ చెప్పడానికి గ్యాప్ తీసుకుంది. చాలా ఆలస్యం అయింది. కానీ డైరెక్టర్ షాట్ ఎందుకు ఒకే చేశారు అనే అనుమానం వచ్చింది. సావిత్రి గారేమో మహానటి , ఆమెని వెళ్లి అడగలేం. అందుకే వెళ్లి డైరెక్టర్ గారిని అడిగా. ఏంటండీ ఆమె డైలాగ్ చెప్పడానికి చాలా గ్యాప్ తీసుకుంది. మీరేమో బ్రహ్మాండం అంటూ ఓకె చేశారు అని అడిగాను.
55
దెబ్బకు మురళీ మోహన్ మైండ్ బ్లాక్
దానికి దాసరిగారు సమాధానం ఇస్తూ.. సాయంత్రం వచ్చి రషెష్ చూడు నీకే తెలుస్తుంది అని అన్నారు. వెళ్లి రషెష్ చూశాను. ఆమె డైలాగ్ చెప్పే గ్యాప్ లో కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు.. అద్భుతం అంతే.. ఇందుకా ఆమె గ్యాప్ తీసుకున్నారు. ఎంతైనా మహానటి మహానటే అని అనుకుంటూ వెళ్లి ఆమె కళ్ళకు నమస్కారం చేసినట్లు మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు.