మరోవైపు ముకుంద ఆలోచిస్తూ కృష్ణ, మురారి కోసం ప్రాణాలకు తెగించి అత్తయ్యకి ఎదురు నిలబడింది. మురారితోపాటు అందరి సానుభూతి సంపాదించుకుంది. ఇంత జరిగాక మురారి ఎవరితోనో మాట్లాడడు. కృష్ణ తోనే మాట్లాడి, మాట్లాడి విడిపోయే విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని కంగారుపడుతూ గట్టిగా అరుస్తుంది. భవాని వచ్చి నీకేమైంది, దేనికి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.