శివకార్తికేయన్ తదుపరి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'మద్రాసి' అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఇంకా ఆయన చేతిలో పరాశక్తి చిత్రం కూడా ఉంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రవి మోహన్, శ్రీలీల, అథర్వ మురళి తో కలిసి శివకార్తికేయన్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది సివకార్తికేయన్ 25వ చిత్రం.