ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ ఆసుపత్రిలో చేరారు. టీఎక్స్ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తన భార్య మౌనికారెడ్డితో కలిసి ఆయన ఆసుపత్రికి వచ్చారు. కుంటుకుంటూ ఆయన ఆసుపత్రికి రావడం గమనార్హం.
మంచు మనోజ్ పరిస్థితి చూస్తుంటే దాడి జరిగింది నిజమే అని తెలుస్తుంది. దీనిపై మనోజ్ స్పందించలేదు. అయితే ఓ ప్రముఖ ఛానెల్తో మాట్లాడుతూ, తనపై దాడి జరిగింది నిజమే అని, తాను పోలీసులకు పిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు.