అల్లు అర్జున్‌ మా టార్గెట్‌ కాదు, దాడులు చేస్తే సహించం, ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుందిః మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ

Published : Dec 23, 2024, 06:06 PM IST

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్‌ని కించపరచడం మా ఉద్దేశ్యం కాదన్నారు. ఇండస్ట్రీ ఏపీకి తరలివెళ్తుందనే రూమర్లపై ఆయన స్పందించారు.   

PREV
15
అల్లు అర్జున్‌ మా టార్గెట్‌ కాదు, దాడులు చేస్తే సహించం, ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుందిః మంత్రి కోమటిరెడ్డి  క్లారిటీ

`పుష్ప 2` సినిమా రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, వాళ్ల అబ్బాయి శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 బాలుడిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పరామర్శించారు. అంతేకాదు `పుష్ప 2` నిర్మాతలతో ఆయన మీడియాతో మాట్లాడారు. `పుష్ప 2` నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ కలిసి బాధిత ఫ్యామిలీకీ రూ.50 లక్షల చెక్కుని అందజేశారు. 


 

25

ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, జరిగిన ఘటన యాక్సిడెంట్‌ అని, అది చాలా దురదృష్టకరం అని, ఈ ఘటనని రాద్దాంతం చేయోద్దని తెలిపారు. ప్రతిపక్షాలు తమ స్వలాభం కోసం ఈ ఘటనని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఘటనని మానవీయ కోణంలో చూడాలన్నారు. అల్లు అర్జున్‌ని మేం కించపరచడం లేదని, అల్లు అరవింద్‌ చాలా రోజులుగా తెలుసు అని వెల్లడించారు.

ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయాలని వాళ్లు ఎంతో ప్రయత్నిస్తున్నారని, అందుకే స్పెషల్‌ షోస్‌, టికెట్ రేట్లు పెంచామని తెలిపారు. అసెంబ్లీలో నాయకుడు అక్బరుద్దీన్‌ అడిగిన ప్రశ్నకి సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పారు, జరిగిన సంఘటన గురించి వివరించే ప్రయత్నం చేశారని, కానీ దాన్ని కొందరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని, సోషల్‌ మీడియాలో రకరకాలుగా పోస్టులు పెడుతూ పెద్ద ఇష్యూ చేస్తున్నారని అన్నారు మంత్రి. 
 

35

సోషల్‌ మీడియాలో అనుచితమైన కామెంట్లు చేస్తే సహించమన్నారు. అలాగే అల్లు అర్జున్‌ ఇంటిపై దాడులను ఆయన ఖండించారు. ఇలాంటి చర్యలను ఎవరూ సహించరని, ప్రభుత్వం పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని, జేఎసీ నాయకులను వదిలేది లేదన్నారు.

దయజేసి అర్థం చేసుకుని సంయమనం పాటించాలన్నారు. ఈ కేసుకి సంబంధించి చట్టం తన పని తాను చేస్తుందని, ఈ విషయంలో ఎవరూ రాజకీయం చేయోద్దన్నారు. ఇండస్ట్రీ అంటే తమకు కోపం లేదని, చిత్రపురి కాలనీలో ఓపెన్‌ ల్యాండ్‌ ఉందని, పేద కార్మికులకు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

45

శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని, ఇంకా బెటర్‌ కావాల్సి ఉందని, త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామన్నారు. థియేటర్ లో జరిగిన ఘటన యాక్సిడెంట్‌ అని, పోలీసులు అనుమతించలేదంటున్నారు, యాజమాన్యం ఇచ్చారని అంటున్నారు, బాడీ గార్డ్స్ తోసేయడంలో ఈ ఘటన జరిగిందంటున్నారు. దీనిపై మరింత విచారణ చేయాల్సి ఉందన్నారు.

ఇక బాధిత కుటుంబానికి తాము అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు మంత్రి. శ్రీతేజ కోసం విదేశాల నుంచిమెడిసిన్‌ కూడా తెప్పించి కోలుకునేలా చేస్తామని, ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందన్నారు. అలాగే మృతురాలు రేవతి కూతురు చదువుకు సంబంధించిన ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటుందన్నారు. ఇక ఈ ఇష్యూని అందరు వదిలేయాలని, పెద్దగా చేయోద్దని విజ్ఞప్తి చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. 
 

55

ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి తరలిపోతుందనే ప్రశ్నకి స్పందిస్తూ, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లిపోదని, చెన్నారెడ్డి హయంలోనే ఇండస్ట్రీ వారికి మంచి ల్యాండ్‌లు ఇచ్చి స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వాలు సహకరించాయని, గతంలో తమ ప్రభుత్వమే పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది.

ఐటీ ఎలా అభివృద్ధి చెందిందో ఇండస్ట్రీ కూడా డెవలప్‌ అయ్యిందని, ఇక్కడే అన్ని రకాలు స్టూడియోలు ఉన్నాయని, అంతర్జాతీయ సినిమాలు కూడా మన వద్ద చిత్రీకరణ జరుపుకుంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ తరలిపోతుందనే పూకార్లు నిజం లేదని, వాటిని నమ్మవద్దు అని, ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తామన్నారు మంత్రి.  

read more: ఏపీకి వెళ్లి ఏం చేస్తాం, పవన్‌ కళ్యాణ్‌ కి స్టార్‌ ప్రొడ్యూసర్‌ కౌంటర్‌.. తప్పు తెలుసుకుని ఏం చేశాడంటే ?

also read: అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, జేఏసీ ఎంట్రీతో ముదిరిన వివాదం.. అసలు తప్పు ఎవరిది?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories