టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ బ్యూటీ మీనాక్షి చౌదరి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ, 2021లో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు టాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది. ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘అనగనగా ఒక రాజు’ లాంటి సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి, వరుస విజయాలతో 'లక్కీ చార్మ్' అనే ఇమేజ్ను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్లోనూ దళపతి విజయ్తో కలిసి నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రస్తుతం కథ, పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మీనాక్షి, గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి.