చరిత్ర సృష్టించిన మణిరత్నం
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన మణిరత్నం, తన క్లాసిక్ చిత్రాలతో చరిత్ర సృష్టించారు. ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో గీతాంజలి ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తికరమైన వార్తలు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.మణిరత్నం ఇటీవల తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమా, కమల్ హాసన్తో కలిసి చేసిన ప్రాజెక్ట్ అయినప్పటికీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చవిచూసింది. ఈ సినిమా తర్వాత ఆయన నవీన్ పొలిశెట్టితో న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేయబోతున్నారని ప్రచారం జరిగినా, తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం.