Guppedantha Manasu: రిషీకి వసుధార అంటే అసహ్యం పుట్టేలా చెయ్యాలి.. దేవయాని మరో ఎత్తుగడ!

Published : Aug 31, 2022, 10:32 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

PREV
16
Guppedantha Manasu: రిషీకి వసుధార అంటే అసహ్యం పుట్టేలా చెయ్యాలి.. దేవయాని మరో ఎత్తుగడ!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి, అక్కడున్న స్టాఫ్ తో పరీక్షల్లో ఎటువంటి లోట్లు రాకూడదు కాపీ జరగకూడదు,చాలా జాగ్రత్తగా ఈ పరీక్షల కార్యక్రమం అంతా జరగాలి అని అంటాడు. ఆ తర్వాత రిషికి వసుధార ఎదురొచ్చి పెన్ ఇచ్చినందుకు థాంక్యూ సార్ అని చెప్తుంది. తర్వాత వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది. అప్పుడు రిషి అక్కడికి వచ్చి మనసులో ఈ ప్రయాణంలో నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను వాసుదార ఇదే నా ప్రమాణం అని అంటాడు. ఇంతట్లో వసు కూడా మనసులో ఈ పరీక్ష మన ప్రేమని నిలబడుతుంది సార్ అని అనుకుంటుంది. 
 

26

ఆరోజు రాత్రి రిషి గదిలో వసుధార పరీక్ష ఎలా రాసిందో ఎన్ని మార్కులు వస్తాయో కనీసం ఎలా రాసిందో చెప్పను కూడా చెప్పలేదు అని అనుకుంటాడు. ఇంతట్లో గౌతమ్ వచ్చి నీలో నువ్వే మనసులో మాట్లాడుకుంటున్నావు, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది అని వసుకి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్  వసూధార అని గౌతమ్ అడగగా చదువుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు రిషి గౌతమ్ చెవిలో తిన్నావా అని అడగమంటాడు తిన్నావా అని గౌతమ్ అడుగుతాడు.తర్వాత రిషి పరీక్ష ఎలా రాసిందో చివరి ప్రశ్నని ఎలా సమాధానం ఇచ్చిందో అడుగు అని అంటాడు. 
 

36

అప్పుడు గౌతమ్ చివరి ప్రశ్న ఎలా రాసావు దానికి రెండు సమాధానాలు ఉంటాయి కదా అని అడగగా రెండు ఉంటాయని మీకు ఎలా తెలుసు సార్ ఫోన్ స్పీకర్ లో ఉన్నదా అని అంటుంది. మనసులో రిషి సార్ ఫోన్ చేపించినట్టున్నారు అని అనుకుంటుంది. ఇంతలో నేను పరీక్షలు బాగా రాస్తా అని ఒకరికి మాట ఇచ్చాను సార్. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయడం మంచిది కాదేమో గుడ్ నైట్ అందరికీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.ఆ తర్వాత పరీక్షలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి,వసు రాస్తూ ఉంటుంది పరీక్ష మధ్యలో జగతి, రిషులు వచ్చి చెకింగ్ చేస్తూ ఉంటారు. రిషి కూడా స్టూడెంట్స్ అందరి దగ్గరికి వెళ్లి పరీక్షలు ఎలా రాస్తున్నారు అని కనుక్కుంటాడు. 
 

46

రెండు రోజుల తర్వాత ,జగతి మహీంద్రలు కూర్చుని చివరి పరీక్ష అయిపోతే మళ్ళీ రిషి వసు కలిసే అవకాశం లేదు అని బాధపడతారు. అప్పుడు జగతి ఏమవ్వదు మహేంద్ర, వసు ఎక్కడికి వెళ్తుంది ఇక్కడే ఉంటుంది కదా అని అంటుంది. ఇంతలో రిషి గౌతమ్ లు కిందకు దిగుతారు కొంచెం కాఫీ తాగి వెళ్దాము అని అంటాడు మహేంద్ర.ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది. ధరణి, కాఫీ కావాల అని అడగగా వద్దు అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి పెద్దమ్మ, పరీక్షలు అయిపోయిన తర్వాత మీకు ఒక శుభవార్త చెబుతాను అని అంటాడు. ఏంటి అది అని అనగా, వసుధార పరీక్షలు బాగా రాస్తాది కదా తన గురించి ఇంక దేని గురించి అని అంటాడు. 
 

56

దేవయాని లోపల చాలా చిరాకుగా ఉంటుంది బయట మాత్రం నవ్వుతూ నటిస్తుంది ఇంతట్లో అందరూ కాఫీ తాగి వెళ్ళిపోతారు. అప్పుడు దేవయాని ధరణి దగ్గరికి వెళ్లి కాఫీ పెట్టించుకుంటుంది. ఆ తర్వాత సీన్లో వసు తర్వాత రోజు పరీక్షకు చదువుతూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ పుష్ప ఇప్పుడు కూడా చదువుతున్నావా వసుధార, రేపు మన చివరి పరీక్ష. ఇంక ఎల్లుండి నుంచి మనం ఎవరు కలుసుకోము ఒకరికొకరు సంబంధం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా రిషి అక్కడికి వచ్చి పరీక్ష ఎలా రాశారు అందరు అని అడుగుతారు. 
 

66

బాగా రాసాము అని అందరూ అంటారు వసుధార మాత్రం సమాధానం చెప్పదు నేను అందరిని అడుగుతున్నాను అందరూ సమాధానం చెప్పాలి అని రిషి అనగా బానే రాశాను సార్ అని వసు అంటుంది. నీతో మాట్లాడకపోవడం తప్పే వసుధార కానీ నీ భవిష్యత్తు కోసమే ఇంకొక రెండు రోజులు ఆగితే సరిపోతుంది అని మనసులో అనుకుంటాడు. మీరు నా కోసమే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు సార్ మీ పేరు నిలపెడతాను అని వసు మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories