`వారణాసి` ప్రమోషన్స్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ షురూ చేశారు రాజమౌళి. ఆ మధ్య `వారణాసి` టైటిల్ని రివీల్ చేస్తూ టీజర్ని విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి.
25
మహేష్ బాబు ఫేవరేట్ ఇండియన్ ఫుడ్
ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలిపారు. ఇండియన్ ఫేవరేట్ ఫుడ్ గురించి ఓపెన్ అయ్యారు. మహేష్ బాబు తన ఫేవరేట్ ఫుడ్ ఏంటో రివీల్ చేశారు. ఆయనకు హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే ఇష్టమని తెలిపారు. ఇక్కడి బిర్యానీని తాను ఇష్టంగా తింటానని వెల్లడించారు.
35
ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్
ప్రియంక చోప్రా కూడా తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని వెల్లడించింది. చికెన్ బిర్యానీని తాను లొట్టలేసుకొని తింటానని చెప్పింది. అంతేకాదు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమట. చాట్ చాలా ఇష్టమట. వీధుల్లో దొరికే ఫుడ్ని ఇష్టంగా తింటానని తెలిపింది. దీనికితోడు కేరళాలోని ఫిష్ అంటే ఇష్టమని వెల్లడించింది ప్రియాంక.
ఇంతలోనే కల్పించుకున్న మహేష్ బాబు.. ఆమె ఏదైనా తింటుంది అని పంచ్ వేయగా, ఆయన నాపై జెలసీతో ఉన్నాడంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ప్రియాంకా వేరే విషయాలు మాట్లాడినప్పుడు కూడా మహేష్ తనదైన పంచ్లతో రెచ్చిపోయాడు. కాసేపు ఆడుకున్నాడు. ఎటకారానికి పెట్టింది పేరు మహేష్. ఇక్కడ కూడా తన టాలెంట్ని చూపించాడు. ప్రియాంకని సెటైర్లతో కాసేపు ఆటపట్టించారు.
55
పృథ్వీరాజ్కి ఇష్టమైన ఫుడ్
ఇక పృథ్వీరాజ్ సుకుమార్ చెబుతూ, ఇండియాలో డిఫరెంట్ ఫుడ్ ఉంటుందని, ఒక్కో ప్లేస్లో ఒక్కోటి ఫేమస్ అని, తనకు మాత్రం, రైస్ ఫిష్ కర్రీతో తినడం చాలా ఇష్టమని తెలిపారు. ఇలా ముగ్గురు స్టార్స్ తమ ఫేవరేట్ ఫుడ్ గురించి వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఇంగ్లీష్ మీడియా క్లిండర్ ఇంటర్వ్యూ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో `వారణాసి` స్టార్స్ తమ ఫేవరేట్ ఫుడ్ని వెల్లడించారు. `వారణాసి` సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది.