Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా.. ? ప్రతీ ఏడాది అంతకు మించిన గ్లామర్ తో అదరగొడుతున్నాడు ప్రిన్స్. తాజాగా వారణాసి నుంచి రిలీజ్ అయిన స్పెషల్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత మెయింటేన్ చేసినా... ఏజ్ పెరుగుతున్నాకొద్ది ముసలితనం కామన్. దాచుకన్నా అది దాగదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం అద్భుతమే జరుగుతుంది. ఆయన వయసు పెరిగే కొద్ది గ్లామర్ రెట్టింపు అవుతోంది. 50 ఏళ్లు దాటినా సూపర్ స్టార్ ఇంకా కుర్ర హీరోలాగానే కనిపిస్తున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరున్న సూపర్ స్టార్.. ఇప్పటికీ అదే లుక్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ లో అభిమానులను ఫిదా చేస్తున్నాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు మహేష్.
24
వారణాసి నుంచి మహేష్ బాబు న్యూ లుక్..
తాజాగా వారణాసి నుంచి మహేష్ బాబు న్యూ లుక్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు మరింత యంగ్ గా, స్మార్ట్ గా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 5 పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. మహేష్ బాబు ఇలా ఎలా మెయింటేన్ చేస్తున్నాడా అని అంతా షాక్ అవుతున్నారు. రాజమౌళి ఇలా ఫోటోస్ రిలీజ్ చేయగానే.. అలా వైరల్ చేసేస్తున్నారు అభిమానులు.
34
మహేష్ బాబు డైట్ సీక్రెట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు 5 పదుల వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు, డైట్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకపోవడం లాంటివి ముఖ్యమైనవి. మహేష్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నచ్చినవి తింటాడు కానీ.. మితంగా తీసుకుంటాడు. బాడీకి సరిపడా ప్రోటీన్, ఫైబర్ అందేలా బ్యాలెన్డ్ మీల్స్ ను మెయింటేన్ చేస్తుంటాడు. ఇక ఆయన లైఫ్ లో షుగర్ కానీ, డైరీ ప్రాడెక్ట్ అయిన పాలు, పెరుగు, వెన్న నెయ్యి లాంటివి అస్సలు ముట్టుకోడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇప్పటి వరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన మహేష్ బాబు వారణాసి సినిమాతో పాన్ వరల్ట్ ను టచ్ చేయబోతున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో.. హాలీవుడ్ కాన్సెప్ట్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. అడ్వెంచర్ కాన్సెప్ట్ కు మైథాలజీ టచ్ ఇస్తూ.. డిఫరెంట్ లైన్ తో జక్కన్న ఈసినిమాను రూపొందిస్తున్నాడు. ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. 2027 సమ్మర్ కానుకగా ఈసినిమాను రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఉంది జక్కన్న టీమ్.