తన తల్లికి ఉన్న పరిచయాల కారణంగా డైరెక్టర్ సయీద్ అక్తర్ దృష్టిలో మయూరి కాంగో పడ్డారు. దీనితో ఆమెకి తొలి చిత్రం నసీం లో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం కోసం మయూరి కాంగో ఐఐటీ కాన్పూర్ లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన 'పాపా కహతే హై' అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచినప్పటికీ మయూరి పేరు మాత్రం మారుమోగింది. అందుకు కారణం ఈ చిత్రంలోని 'ఘర్ సి నికల్తీ' అనే సాంగ్ అనే చెప్పాలి.ఆ తర్వాత మయూరికి అజయ్ దేవగన్, సంజయ్ దత్ లాంటి హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమె మరిన్ని ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది.