చిన్న వయసులోనే విజయ్, కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నా లోకేష్ కనకరాజ్, తక్కువ సమయంలోనే కోటీశ్వరుడయ్యారు.కోయంబత్తూరులోని కినత్తుక్కడవులో పుట్టి పెరిగిన లోకేష్ కనకరాజ్, 2016లో 'అవ్యయల్' అనే ఆంథాలజీ షార్ట్ ఫిల్మ్తో తన కెరీర్ను ప్రారంభించారు.
ఈ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ లోకేష్ ను దర్శకుడిగా మార్చింది. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'మానగరం'. 2017లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా, మునీష్కాంత్, చార్లీ, శ్రీ లాంటి యంగ్ స్టార్స్ నటించారు.