కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. కేరళ పురాణగాథ కల్లియంకాట్టు నీలి ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శాండీ, చందు సలీమ్కుమార్, అరుణ్ కురియన్, శరత్ సభ, నిశాంత్ సాగర్, విజయరాఘవన్ ఇతర పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, సన్నీ వెయిన్ అతిథి పాత్రల్లో కనిపించారు. దీని తర్వాతి భాగం టోవినో థామస్ ప్రధాన పాత్రలో రానుంది.