Intinti gruhalakshmi: తులసి తప్పుగా మాట్లాడిన లాస్య.. ప్రేమ్ మాటలకు బాధపడుతున్న శృతి!

First Published Aug 18, 2022, 11:12 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్ సముద్రం ముందర తులసి గారు తులసి గారు అని అరుస్తూ ఉంటారు. ఈలోగ అక్కడున్న జనాలు, ఎవరైనా బీచ్ లోపలి కొట్టుకొని పోతే తిరిగి వచ్చినట్టు చరిత్రలోనే లేదు అని అంటారు. సామ్రాట్ కి ఇంకా భయం వేసేస్తుంది ఈ లోగ వెనకాతల నుంచి తులసి రెండు మొక్కజొన్నలు పట్టుకొని వస్తుంది. అదేంటి సామ్రాట్ గారు ఆ రాయి వైపు వెళ్లొద్దన్నారు కదా ఇప్పుడు మీరే వెళ్తున్నారు ఏంటి అని నవ్వుతూ అడగగా సామ్రాట్ కి కోపమొచ్చి అసలు మీకు ఏమైనా బుద్ధుందా. చిన్న పిల్లల బీచ్ కి వచ్చి ఆడుకుంటే చిన్నపిల్లలు అయిపోయినట్టు అనుకుంటారా ఎక్కడికి వెళ్తున్నారో కనీసం నాకు చెప్పి వెళ్లాలి కదా మిమ్మల్ని ఇక్కడికి తెచ్చినందుకు బాధ్యత నాదే కదా అని తిడతాడు.
 

అప్పుడు తులసి కోప్పడకండి సామ్రాట్ గారు చిన్న పిల్లని కాదు కాబట్టి మీరు చెప్పినట్టు అటువైపు వెళ్ళలేదు మొక్కజొన్నమ తినాలనిపించి మీకు చెబుదామని మీ దగ్గరికి వస్తే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనే వెళ్లాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో అంకిత, ప్రేమ్ శృతిలను ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ్ ఇక్కడ చాలా కోపంగా ఉన్నాడు శృతి తో మాట్లాడితే శృతి కూడా అలాగే కోపంగా ఉంటుంది ఇంక దీన్ని పరిష్కరించాల్సింది తులసి ఆంటీ మాత్రమే అని అంకితం అనుకుంటుంది.
 

ఈ లోగ అంకితకి ఒక ఫోన్ వస్తుంది వాళ్ళ హాస్పటల్ నుంచి, ఈ మధ్య వాతావరణ మార్పిడి వల్ల జ్వరాలు పెరుగుతున్నాయని ఆదిలాబాద్ లో మెడికల్ క్యాంపు కి తననే ఇన్చార్జిగా పెట్టారని వెంటనే బయలుదేరుమని చెప్తారు అప్పుడు అంకిత సరే నేను బయలుదేరుతున్నాను అని అంటుంది. ఈ మాటలు విన్న అభి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే ఇలా క్యాంప్ పెట్టారు ఆంటీ అలాగే రేపు వచ్చేస్తారు కదా ఇంకేం పర్లేదు అని అంకిత అంటుంది. ఆ తర్వాత సీన్లో తులసి సామ్రాట్ లు మొక్కజొన్న తింటూ ఉంటారు ఇంతట్లో లాస్యందులు అక్కడికి వస్తారు. అప్పుడు లాస్య ఈ పందెంలో నేనే గెలిచాను నందు నాకు పదివేలు ఇవ్వు అని లాస్య అనగా నందు మనసులో మనమేం పందెం కట్టుకున్నాము అని అనుకుంటాడు.
 

ఈలోగ సామ్రాట్ ఏం పందెం అని అనగా మేము బీచ్ కి వెళ్దాం అని అనుకున్నాము మిమ్మల్ని కూడా పిలుద్దాం అనుకుంటే మీ తలుపులు వేసేసి ఉన్నాయి. అప్పుడు నందు మీరు గుడికి వెళ్లారు అని అన్నాడు. నేను మాత్రం లేదు మీరు బీచ్ కి వచ్చారు అని అన్నాను. కనుక నేనే గెలిచాను అని అంటుంది. అప్పుడు లాస్య నందు తో వైజాగ్ కి వచ్చిన కపుల్స్ ఎవరైనా బీచ్ కి రావాల్సిందే అని అనగా తులసికి చాలా కోపం వస్తుంది. ఇంతట్లో లాస్య తులసికి మల్లెపూల దండ ఇచ్చి ఇష్టం లేకపోయినా తన తల మీద పెడుతుంది. చాలా తప్పుడుగా మాట్లాడుతుంది లాస్య అప్పుడు తులసి నేను ముందు ఉన్న తులసిని కాదు కత్తిని కత్తితోనే తీస్తాను జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

అప్పుడు నందుకు లాస్యతో అంత సూటిగా అడిగేసావు ఎందుకు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో శృతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శృతి వాళ్ళ అత్త, చాలా తొందర పడ్డావు ఏమో శృతి. తాడుని తెంచే వరకు లాగకూడదు ప్రేమతో ప్రేమ్ ని మారుస్తావ్ అనుకుంటే తన ఈగో మీద కొట్టావు అని అంటుంది. నేను ఇందాక మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అంకిత చెప్పింది అని రావడం ఏంటి? ఇలా అయితే చక్కగా కాపురం చేస్తాడని నాకు నమ్మకం ఏంటి? అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శృతి. ఆ తర్వాత సీన్లో తులసి సామ్రాట్ లో చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.
 

అదేమీ లేదు అని సామ్రాట్ అంటాడు తర్వాత నందు లాస్యలు తినడానికి వెళ్తుండగా నాకు తినాలని లేదు నందు అని అంటుంది లాస్య పోని నేను తింటాను అని నందు అనగా లాస్య, తులసి అని మాటలు అన్న కూడా నీకు ఎలా తినాలి అనిపిస్తుంది అని అంటుంది. దానికి నందు బాధ లేదు అని అనడం లేదు కదా అలాగని ఆకలి చంపుకోకూడదు అని అంటాడు.లాస్య వాష్ రూమ్ కి వెళ్తుంది.ఈ లోగ నందు టేబుల్ మీద కూర్చుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!