మద్రాస్ లో 100 రోజులు ఆడిన అరుదైన సినిమా
అంతే కాదు సింహాసనం సినిమా మరికొన్ని రికార్డ్ లకు కేంద్రం అయ్యింది. మద్రాసులో 100 రోజులు ప్రదర్శించబడిన అరుదైన తెలుగు చిత్రంగా సింహాసనం నిలిచింది. ఈసినిమా విడుదలయ్యాక 400 బస్సుల్లో అభిమానులు విజయయాత్రకు హాజరయ్యారు. ఇది మాత్రమే కాదు, కృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదలైన రికార్డుల్లోనూ ముందున్నాయి.
1976 నుంచి 21 ఏళ్లపాటు ప్రతి సంక్రాంతికి ఆయన సినిమాలు విడుదల కావడం ఒక అపూర్వమైన ఘనత. అలాగే ఆయన నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ హైదరాబాద్లో ఏకంగా ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది. ఈ నేపథ్యంలో ‘సింహాసనం’ సినిమా కృష్ణ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.