ఈ చిత్రం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైనప్పుడు కోట కూడా నటించారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిష్ గారు మంచి డైరెక్టర్ ఆయన పిలిచి మూడు రోజుల షూటింగ్ ఉండే పాత్ర ఉందని చెప్పారు. ఆ పాత్రలో తాను నటించానని కోట ఖరారు చేశారు.
ఎడిటింగ్లో తొలగిపోకుంటే తప్ప కోట శ్రీనివాసరావు నటించిన చివరి చిత్రం హరిహర వీరమల్లు అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ చిత్రాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఆ మూవీలో కోట శ్రీనివాసరావు 'మందు బాబులం' అనే సాంగ్ ని పాడిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ వెనుక ఆసక్తికర విషయాన్ని ఆయన రివీల్ చేశారు.