ఖుష్బూ సుందర్ సినీ రంగంలో తన ప్రయాణాన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలు పెట్టారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో "కలియుగ పాండవులు" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈసినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. వెంకటేష్ కూడా ఈసినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక కలియుగ పాండవులు సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.