కీర్తి సురేష్‌ కి అరుదైన గౌరవం.. మహానటి ఖాతాలో పడిన మరో సత్కారం ఏంటో తెలుసా?

Published : Jan 30, 2026, 06:51 PM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో సత్తా చాటుతోంది సహజ నటి కీర్తి సురేష్. జాతీ అవార్డును తన ఖాతాలో వేసుకున్న ఈ తార మరో అరుదైన సత్కారం సాధించింది. ఇంతకీ ఏంటది?

PREV
13
కీర్తి సురేష్‌ కి అరుదైన గౌరవం

తమిళనాడు ప్రభుత్వం 2016-2022 సంవత్సరాలకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 2017లో వచ్చిన యాక్షన్-థ్రిల్లర్ 'పాంబు సత్తై'లో అద్భుత నటనకు కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆడమ్ దాసన్ దర్శకత్వంలో, వేణి పాత్రలో కీర్తి నటన అందరినీ ఆకట్టుకుంది.

23
జాతీయ అవార్డు తరువాత..

ఫిబ్రవరి 13న చెన్నైలోని కలైవనార్ అరంగంలో జరిగే అధికారిక వేడుకలో కీర్తి ఈ అవార్డును అందుకుంటారు. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత ఇది ఆమెకు మరో పెద్ద గౌరవం. 2018లో వచ్చిన మహానటి బయోపిక్‌లో సావిత్రి పాత్రలో ఆమె నటనకు ఏకగ్రీవ ప్రశంసలు దక్కాయి.

33
కీర్తి సురేష్ సినిమాలు..

కీర్తి సురేష్ ప్రస్తుతం బిజీ బీజీగా ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో 'అక్క' అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్ధన', ఆంటోనీ వర్గీస్‌తో 'తోట్టం' సినిమాల్లో నటిస్తోంది. రాజ్ కుమార్ రావుతో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర, జాతీయ అవార్డులతో కీర్తి సురేష్ బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటోంది.

Read more Photos on
click me!

Recommended Stories