Brahmamudi: కోడలి ట్రాప్ లో పడిపోయిన అపర్ణ.. క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్న కావ్య!

Published : Oct 03, 2023, 10:30 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంది. భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలని తపన పడుతున్న భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: కోడలి ట్రాప్ లో పడిపోయిన అపర్ణ.. క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్న కావ్య!

 ఎపిసోడ్ ప్రారంభంలో మా అమ్మ మొండిది ఎవరు చెప్పినా వినదు అంటుంది కావ్య. మా అక్క చెప్పిన వినదా అంటుంది ధాన్యలక్ష్మి. ఇక్కడికి వస్తే మాటలు పడాల్సి వస్తుందని ఇబ్బంది పడుతోంది అంటుంది కావ్య. కూతురు కోసం ఆ మాత్రం మాటలు పడలేదా.. అయినా నేను పిలిస్తే ఎందుకు రాదో చూస్తాను అంటూ కనకానికి ఫోన్ చేసి పండక్కి రమ్మని పిలుస్తుంది అపర్ణ. మీరు పిలిస్తే తప్పకుండా వస్తాం అంటుంది కనకం. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక నువ్వు రేపు మీ ఇంటికి వెళ్లక్కర్లేదు.

28

 మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తారు. నీ పనులు ఇక్కడే చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇదంతా చూస్తున్న రుద్రాణి మా వదిన ఇంత సులువుగా కోడలు ట్రాప్ లో పడిపోతుంది అనుకోలేదు అని మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు చీర కట్టుకుంటున్న స్వప్న కడుపుకి పెట్టుకున్న ప్యాడ్ జారిపోతుందేమో అని కంగారుపడుతుంది. జారకూడదని కోరుకుంటుంది.

38

మరోవైపు అందరూ కలిసి తీసుకువచ్చి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. అప్పుడు కావ్య నుదుటన ఉన్న స్టిక్కర్ పడిపోతుంది. అయితే కోడలి మొహాన బొట్టు లేకపోవడంతో ఆమెని మందలిస్తుంది అపర్ణ. పెట్టుకున్నాను కానీ పడిపోయినట్లుగా ఉంది ఇప్పుడే మళ్ళీ వెళ్లి పెట్టుకుని వస్తాను అంటుంది కావ్య. దీనికోసం మళ్లీ పైకి వెళ్ళటం ఎందుకు అని రాజ్ ని కావ్యకి బొట్టు పెట్టమని చెప్తుంది చిట్టి. బామ్మ మాట కాదనలేక కావ్య నుదుటిన బొట్టు పెడతాడు రాజ్.
 

48

ఇక చీటీల కార్యక్రమం మొదలు పెడదాం అంటుంది చిట్టి. అదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్న. మన ఇంట్లో వాళ్ళ కోరికలన్నీ పేపర్ల మీద రాసి ఒక సిటీలో వేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. అపర్ణ కడుపుతో ఉన్నప్పుడు మేమందరం తనకి పిల్లలు కలగాలని చీటీ మీద రాశాం. వెంటనే అపర్ణ కడుపు పండింది. అది మాకు బాగా నిదర్శనం ఉంటుంది చిట్టి. అయితే చీటీలు రాజకీయాల్సిందే అంటుంది కావ్య. నువ్వేం రాస్తావో మాకు తెలుసులే అందుకే ఒకేసారి ఇద్దరు పిల్లలు కావాలని రాయు ఓ పని అయిపోతుంది అని నవ్వుతుంది ధాన్యలక్ష్మి.
 

58

చిట్టి చెప్పడంతో వెళ్లి కాగితాలు పెన్ను తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది ధాన్య లక్ష్మి. సీతారామయ్య ముని మనవడు పుట్టే వరకు ప్రాణాలు కాపాడమని చీటీలో రాస్తాడు. చిట్టి సుమంగళిగా పోవాలని రాస్తుంది. ధాన్య లక్ష్మీ బంగారం కావాలని రాస్తుంది ఇలా ఒక్కొక్కరు వాళ్లకు నచ్చిన కోరిక రాస్తారు. రాజ్ మాత్రం నేను తాతయ్య కోరిక తీర్చాలని కావ్యతో చనువుగా ఉంటున్నాను కానీ నాకు తనను చూస్తుంటే గిల్టీగా అనిపిస్తుంది త్వరలోనే ఈ పరిస్థితి నుంచి దూరం చెయ్యు అని రాస్తాడు.
 

68

 భర్త కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అమలు జరిగేలాగా చూడమని కావ్య రాస్తుంది. రాజ్ ఏమి రాశాడో తెలుసుకోవాలని ఆ కాగితం వైపు తొంగి చూస్తుంది కావ్య కానీ అలా చూడకూడదు అని చెప్పడంతో ఆగిపోతుంది. కానీ ఆ చీటీలో ఏముందో ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇక ఈ పని అయిపోయింది కాబట్టి వెళ్లి వంట పని చేయండి అని పురమాయిస్తుంది చిట్టి. కాసేపటి తర్వాత కావ్య వినాయకుడి దగ్గరికి వచ్చి భర్త చీటీలో ఏం రాశాడో తెలుసుకోవాలనుకుని దొంగ చాటుగా ఆ జార్ లో చెయ్యి పెట్టబోతోంది.
 

78

 మళ్లీ వినాయకుడిని చూసి నా భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలనుకోవడం నా బాధ్యత. నాకే కాదు నీకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే నీవల్లే మేము కలిసాము. కాబట్టి ఆ చీటీ తీసి చదివేశానని నామీద కోపం తెచ్చుకొని శపించకు అని వినాయకుని చెవిలో చెప్తుంది. అప్పుడే వినాయకుని చేతిలో ఉన్న పువ్వు కింద పడిపోవటంతో వినాయకుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకోని జార్లో చేయి పెట్టబోతుంది కావ్య. అప్పుడే అక్కడికి కంగారుగా వచ్చిన కళ్యాణ్ అనామిక తల్లిదండ్రులను తీసుకొని వస్తుంది.
 

88

 పెద్దమ్మ, రుద్రాణి అత్తయ్య ఏం మాట్లాడతారో అని కంగారుగా ఉంది అంటాడు. నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతుంది కావ్య. మళ్లీ చీటీ తీయడం కోసం జార్ లో చెయ్యి పెట్టబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్య లక్ష్మి ఏం చేస్తున్నావు, పద మీ అమ్మ వాళ్లు వచ్చారు అని చెప్పటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఇంట్లోకి వచ్చిన కనకం కూతుర్ని చూసి ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో పూజ అయిపోయిన తర్వాత టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారు కావ్య వాళ్ళు.

click me!

Recommended Stories