Guppedantha Manasu: వియ్యపురాలి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరిన చక్రపాణి.. తుది శ్వాస విడిచిన జగతి!

Published : Oct 03, 2023, 09:53 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలు కోల్పోయిన ఒక తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: వియ్యపురాలి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరిన చక్రపాణి.. తుది శ్వాస విడిచిన జగతి!

 ఎపిసోడ్ ప్రారంభంలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేస్తూ ఉంటాడు శైలేంద్ర. కొడుకు దగ్గరికి వచ్చిన ఫణీంద్ర నువ్వు ఇలా దగ్గరుండి పనులు చేస్తుంటే చాలా బాగుంది దీనిని బట్టి నీకు రిషి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది అంటాడు. ఇష్టమా, తొక్కా..ఇదంతా మిమ్మల్ని ఇంప్రెస్ చేయటానికే అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. పంతులుగారు పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడిని పిలిపించండి అంటంతో రిషి, వసుధార  కిందికి వస్తారు.
 

28

రిషి వేపు చూస్తూ ఈ పెళ్లి మీరు మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నారా అని అడుగుతుంది వసుధార. ఇది నీ కోసమో నా కోసమో చేసుకుంటున్న పెళ్లి కాదు, మా అమ్మ కోసం చేసుకుంటున్న  పెళ్లి అంటాడు రిషి. మీ అమ్మగారికి కబురు పెట్టావా అని వసుధారని అడుగుతాడు. వసుధార ఏదో చెప్పే అంతలో  పంతులుగారు పిలవటంతో పీటల మీదకి వెళ్లబోతారు. ఇంతలో జగతి వీల్ చైర్ మీద నుంచి పడిపోబోతుంది.
 

38

 కంగారుగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని పట్టుకొని చైర్ లో  కూర్చోబెట్టి  ఏం కావాలి అని అడుగుతాడు రిషి. ఈ పెళ్లి  జరగాలని నేను ఎన్నో రోజుల నుంచి కలలు కన్నాను. అది ఈరోజు నిజం అవుతుంది అంటూ ఎమోషనల్ అవుతుంది జగతి. ఆ తర్వాత మహేంద్ర ని ఎప్పుడు ఒంటరిగా వదలొద్దు అని భర్త బాధ్యత కొడుకుకి అప్పజెప్తుంది. అప్పుడే చక్రపాణి వస్తాడు. వస్తూనే జగతిని చూసి పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకుంటాడు.
 

48

 తను జగతిని అవమానించిన విషయం గుర్తుతెచ్చుకొని కన్నీటితో ఆమె పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటుంది జగతి. నేను మీకు చేసిన అవమానం మీరు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేదు. వాళ్ళిద్దరూ విడిపోవడానికి మీరే కారణం అనుకున్నాను కానీ వాళ్ళిద్దరూ కలవటానికి ఇప్పుడు మీరే కారణం అవుతున్నారు అంటాడు చక్రపాణి. ఇప్పుడు క్షమాపణలు చెప్పే సమయం కాదు సంతోషపడే సమయం అంటుంది జగతి.
 

58

 ఇప్పుడు చెప్పలేకపోతే మళ్లీ చెప్పలేనేమో అందుకే చెప్తున్నాను అంటాడు చక్రపాణి. సరే వెళ్లి పీఠల మీద కూర్చుండి అని జగతి చెప్పటంతో పీటల మీద కూర్చుంటారు రిషి, వసుధారలు. పంతులుగారు గణపతి పూజ చేసిన తరువాత బాసికాలు  కట్టమంటారు. దేవయాని నేను కడతాను అంటే రిషి అమ్మ చేత కట్టించుకుంటాను అలా చేస్తే ఆవిడ సంతోషిస్తుంది అని చెప్పి జగతి చేత బాసికాలు కట్టించుకుంటారు రిషి, వసుధార.
 

68

 ఆ తరువాత పెళ్లి పీఠల  మీద కూర్చొని వసుధార మెడలో తాళిబొట్టు కడతాడు రిషి. ధరణి అందరికీ అక్షింతలు ఇస్తుంది. అయితే ముభావంగా ఉన్న ధరణి ని ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది జగతి. ఏ నిమిషాన వీళ్లు ఏం దారుణం చేస్తారో అని భయంగా ఉంది అంటుంది ధరణి. ఏమీ కాదు అంతా మంచే జరుగుతుంది సంతోషంగా ఉండు అని చెప్తుంది జగతి. పంతులుగారు దంపతులిద్దరిని పూల దండలు మార్చుకోమంటే ఒక్క నిమిషం అని చెప్పి జేబులోంచి జగతి ఇచ్చిన నల్లపూసలు తీసి వసుధార మెడలో వేస్తాడు రిషి.
 

78

చాలా ఆనంద పడిపోతుంది జగతి. నీ కోరిక తీరింది కదా అంటూ ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి దంపతులు ఫణీంద్ర దంపతులు దగ్గర ఆశీర్వచనం తీసుకొని తల్లి దగ్గరికి వస్తారు. వసుధార ని నన్ను అత్తయ్య అని పిలవవా అని అడుగుతుంది జగతి. వసుధార రిషివైపు చూస్తుంది. మీ ఎండి గారు పర్మిషన్ ఇస్తేనే కానీ పిలవవా అని నవ్వుతుంది జగతి. ఆయన అనుమతి కోసం చూస్తున్నాను మేడం అంటుంది జగతి. ఇప్పుడు నువ్వు మా అమ్మని పిలవ వలసింది మేడం అని కాదు అత్తయ్య అని అంటాడు రిషి.
 

88

 అప్పుడు ఆనందంగా మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య, మావయ్య అంటుంది వసుధార. కొత్త దంపతులని మనస్పూర్తిగా దీవిస్తూ నేను ఇది చూడటానికే ప్రాణాలతో ఉన్నాను ఇకపై నేను చనిపోయిన పర్వాలేదు అని మనసులో అనుకొని అక్షింతలు వేస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది జగతి. ఫ్రీజ్ అయిపోయిన జగతిని చూసి అందరూ కంగారు పడతారు. జగతిని టెస్ట్ చేసి ఆమె చనిపోయింది అని చెప్తుంది సిస్టర్. అందరూ షాక్ అయిపోతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories