కత్రినా కైఫ్ 2003 నుంచి సినిమాల్లో నటిస్తోంది. ఆమె మొదటి సినిమా మల్లీశ్వరి తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఆతరువాత టాలీవుడ్ వదిలి బాలీవుడ్ చేరింది. ఇక్కడ ఆమె చేసిన 'బూమ్' డిజాస్టర్ అయ్యింది. తర్వాత 'మైనే ప్యార్ క్యూ కియా', 'అప్నే', 'పార్ట్నర్', 'వెల్కమ్', 'సింగ్ ఈజ్ కింగ్', 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'సూర్యవంశీ', 'టైగర్ 3' లాంటి సినిమాల్లో నటించింది. విక్కీ కౌశల్ 2012లో 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్'తో అసిస్టెంట్ డైరెక్టర్గా, చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టాడు. 2015లో 'మసాన్'లో మొదటిసారి లీడ్ రోల్ చేశాడు. తర్వాత 'జుబాన్', 'సంజు', 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్', 'గోవిందా నామ్ మేరా', 'సామ్ బహదూర్', 'ఛావా' లాంటి సినిమాల్లో కనిపించాడు.