అప్పుడు రాంపండులు ముఖం దీనంగా పెడతారు. ఏమైంది రాంపండు అలా పెట్టారు అని అడగగా నీ వంటని మిస్ అవుతాం అని అంటారు. అప్పుడప్పుడు మీకు కూడా భోజనం పంపిస్తాను మీరేం బాధపడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది దీప. ఆ తర్వాత సీన్లో సౌందర్య హిమకి పుట్టినరోజు వస్తుంది కదా బట్టలు కొనుక్కోమని అంటుంది. నాకు వద్దు నానమ్మ అని అంటుంది హిమ. అప్పుడు సౌందర్య, ప్రతి సంవత్సరం నాలుగు రోజుల ముందే బట్టలు కావాలి, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి అంటావు కదా ఈ సంవత్సరం ఏమైంది అని అంటుంది. అప్పుడు హిమ, ఈ సంవత్సరం నాకు ఇవేవీ వద్దు నానమ్మ అనాధ శరణాయానికి వెళ్లి డబ్బులు ఇచ్చేసి వారికి భోజనం పెడదామని అంటుంది.