అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్
అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోకి 2019లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఈసినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలో కూడా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈసినిమా ప్రపపంచ వ్యాప్తంగా ఓవర్ ఆల్ రన్ లో 400 కోట్లకు పైగా వసూలు చేసి, బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగు సినిమా నుంచి హిందీ రీమేక్ గా రూపొందిన సినిమాల్లో ఈ సినిమా చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన మార్క్ దర్శకత్వ శైలిని హిందీలోనూ కొనసాగించి, కథలోని ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించారు.