తాతగారు తప్పు చెప్పరు..జూనియర్ ఎన్టీఆర్ లాజిక్ విని స్టార్ హీరోకి మైండ్ బ్లాక్, ఏం జరిగిందంటే

First Published Sep 18, 2024, 9:39 AM IST

జూనియర్ ఎన్టీఆర్ కి పురాణాలపై మంచి నాలెజ్డ్ ఉంది. ఆయన తాతగారు ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. కాబట్టి పురాణాలకి సంబంధించిన అవగాహన తారక్ కి కూడా బాగా ఉంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. దేవర చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో తారక్ అండ్ దేవర టీం ఇండియాలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ తమ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. దేవర పాన్ ఇండియా చిత్రంగా భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలతో పాటు ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. 

ఒక టివి కార్యక్రమంలో ఎన్టీఆర్ తన తాతగారు నందమూరి తారక రామారావు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే టివి కార్యక్రమానికి హోస్ట్ గా చేశారు. ఈ షోకి కంటెస్టెంట్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఒక ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా హాజరయ్యారు. 


బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Videos


ఈ షోలో నాగార్జున అడిగే ప్రశ్నలకు అతిథులు సమాధానం ఇవ్వాలి. సినిమా, క్రీడలు, రాజకీయాలు, సైన్స్ ఇలా అన్ని రంగాలకి సంబందించిన జనరల్ నాలెజ్డ్ ప్రశ్నలు ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ని నాగార్జున పురాణాలకి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. మహాభారతంకి సంబంధించిన ప్రశ్న అది. జూనియర్ ఎన్టీఆర్ కి పురాణాలపై మంచి నాలెజ్డ్ ఉంది. ఆయన తాతగారు ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. కాబట్టి పురాణాలకి సంబంధించిన అవగాహన తారక్ కి కూడా బాగా ఉంది. 


Also Read: చిరంజీవితో రొమాన్స్, పెళ్లయ్యాక నా సినిమాలు నువ్వు చూడకూడదు..భర్తకి హీరోయిన్ కండిషన్

నాగార్జున.. మహాభారతంలో ద్రోణాచార్యుడు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. వసిష్ఠుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకి తారక్ కూడా కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. దీనితో తారక్ తన తాతగారు నటించిన దానవీర శూర కర్ణ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే డైలాగ్ కి మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో చెప్పారు. 

దానవీర శూర కర్ణ డైలాగ్ లో భాగంగా ఎన్టీఆర్.. ద్రోణాచార్యుడు వంక చూస్తూ నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది.. అతి జుగుత్సాకరమైన నీ సంభవ మెట్టిది..అంటూ డైలాగ్ కొనసాగిస్తారు. తాతగారు చెప్పారంటే అందులో తప్పు ఉండదు. కాబట్టి ద్రోణాచార్యుడు తండ్రి భరద్వాజుడే అనే ఎన్టీఆర్ నాగార్జునకి సమాధానం ఇచ్చారు. దీంతో నాగ్ ఆ ఆన్సర్ ని ఫిక్స్ చేసి ఫెంటాస్టిక్.. కరెక్ట్ ఆన్సర్ అని తారక్ ని అభినందించారు. 

తారక్ లాజిక్ ప్రకారం ఆలోచించి, తన తాతగారి డైలాగ్ ని గుర్తు చేసుకుంటూ సమాధానం ఇవ్వడం చూసి నాగార్జున ఫిదా అయ్యారు. పురాణాల మీద తాతగారు బాగా రీసెర్చ్ చేశారు కదా అని నాగార్జున అడగగా.. మొత్తం ఆయనకి తెలుసు అని తారక్ సమాధానం ఇచ్చాడు. 

click me!