మీరు నాకు ఏ శిక్ష వేసిన భరిస్తాను,నన్ను క్షమించండి ,అంతేగాని మీరు ఆయనతో మాట్లాడకుండా ఆయనకి పెద్ద శిక్ష వేయొద్దు అని ప్రాధేయపడుతుంది జానకి. రామ కూడా జ్ఞానాంబ ని బతిమిలాడుతాడు. ఆలోచనలలో పడుతుంది జ్ఞానాంబ. నా పంతం కోసం పిల్లలను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అని జ్ఞానాంబ మనసులో అనుకొని, జానకి దగ్గర నుంచి వాయనం పుచ్చుకుంటుంది. మల్లిక ముఖం మాడిపోతుంది.