మరోవైపు, పుదుక్కోట్టైలోని విజయ్ థియేటర్లో రాష్ట్ర కార్మిక సంక్షేమ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జా. మహమ్మద్ పర్వేజ్ 'జననాయగన్' సినిమా మార్నింగ్ షో చూశారు. విజయ్కి వీరాభిమాని అయిన ఆయన, సినిమా మొదలయ్యే ముందు చాలా ఉత్సాహంగా కనిపించారు. అయితే, సినిమా చూస్తున్నప్పుడు మంత్రి పర్వేజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్క్రీన్పై విజయ్ను చూడగానే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే తన చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అభిమాన నటుడు ఇకపై సినిమాల్లో నటించడనే బాధతోనే మంత్రి పర్వేజ్ థియేటర్లోనే ఏడ్చేశారని టీవీకే (తమిళగ వెట్రి కళగం) కార్యకర్తలు, నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఎమోషనల్ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Courtesy : galattadotcom Instagram Page