Guppedantha Manasu: జగతిని హెచ్చరించిన ధరణి.. నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతున్న మహేంద్ర?

Published : Jun 29, 2023, 07:12 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తను నమ్మిన వ్యక్తి తన కొడుక్కి హాని తల పెట్టాడు అని తెలుసుకొని కోపంతో రగిలిపోతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
110
Guppedantha Manasu: జగతిని హెచ్చరించిన ధరణి.. నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతున్న  మహేంద్ర?

ఎపిసోడ్ ప్రారంభంలో వసుని ఇంటికి తీసుకువచ్చిన ఏంజెల్ జరిగిందంతా విశ్వనాధానికి చెప్తుంది. జరిగిందానికి బాధపడుతూ తనని ఇంటికి తీసుకువచ్చి మంచి పని చేశావు అంటాడు విశ్వనాథం. ఇక్కడికి రావడానికి తను చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్తుంది ఏంజెల్. ఎందుకమ్మా ఇది కూడా మీ ఇల్లు అనుకో ఇక్కడ నీకు ఏ లోటు రాదు అని వసు కి చెప్తాడు విశ్వనాథం.
 

210

వసుని లోపలికి తీసుకెళ్లి పోతుంది ఏంజెల్. మరోవైపు ప్రిన్సిపల్ రిషికి ఫోన్ చేసి కేడి బ్యాచ్ లో వచ్చిన మార్పు కి మీరే కారణం అంటూ రిషిని మెచ్చుకుంటాడు.నాలుగు మంచి మాటలు చెప్పారు అంతే ఇందులో నాదేముంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. రిషి విశ్వనాథంతో ప్రిన్సిపల్ ఫోన్ సంగతి చెప్తాడు.నాకు కూడా ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు నిన్ను తెగ మెచ్చుకుంటున్నారు అని ఆనందంగా చెప్తాడు విశ్వనాథం.
 

310

మరోవైపు మంచం మీద ఉన్న వసుధార నేను మీ ఇంట్లో ఉండడం ఎవరికీ ఇబ్బంది లేదు కదా అని ఏంజెల్ ని అడుగుతుంది. అదేంటి అలా అంటావు ఇప్పుడే విశ్వం  మాటలు విన్నావు కదా అయినా నీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది నువ్వు రిషి గురించి ఆలోచిస్తున్నావా తను చాలా మంచివాడు ఇలాంటి విషయాల్లో ఇంకా సపోర్ట్ ఇస్తాడు. తను కూడా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అంటూ రిషి ని పొగుడుతుంది ఏంజెల్.

410

మీ ఫ్రెండ్ అంటే మీకు అంత ఇష్టమా అని అడుగుతుంది  వసుధార. రిషి ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నువ్వే చూస్తావు కదా రెండు రోజుల్లో నువ్వు కూడా మీ ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం అని నువ్వే చెప్తావు అంటుంది ఏంజెల్. మరోవైపు రిషి మాటలు వినాలని తాపత్రయపడుతూ ఉంటాడు మహేంద్ర. కానీ తన ఫోన్ తో చేస్తే ప్రమాదమని పక్కనే ఉన్న కొబ్బరిబోండానికి ఇంతకీ డబ్బులు ఇచ్చి అతని ఫోన్ తీసుకొని అతని ఫోన్ తో రిషి ఫోన్ చేస్తాడు.
 

510

రిషి అట్నుంచి మాట్లాడుతూ ఉంటే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతాడు కానీ మాట్లాడితే ఎక్కడ ఫోన్ పెట్టేస్తాడో అని మాట్లాడడు. ఫోన్లో ఏమీ మాట్లాడకుండా తనకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్న మహేంద్రని చూసి ఆశ్చర్యపోతాడు కొబ్బరి బోండాలతను. రిషి కూడా రాంగ్ నెంబర్ అనుకొని లైట్ తీసుకుంటాడు. మరోవైపు ఏంజెల్ కృష్ణమూర్తికి ఫోన్ చేసి వసు యాక్సిడెంట్ విషయం చెప్తుంది.
 

610

తనని ఇక్కడే ఉంచుకుంటాను మీరేమీ కంగారు పడకండి ఇదిగోండి వసుతో మాట్లాడండి అని చెప్పి ఫోన్ వసు కి ఇస్తుంది ఏంజెల్. కృష్ణమూర్తి కంగారుపడుతూ నాకు భయంగా ఉంది నిన్ను చూడడానికి వస్తాను అంటాడు. చెప్పిన మాట విను ఈ రాత్రికి వద్దు నేను బాగానే ఉన్నాను అని చెప్పడంతో జాగ్రత్త చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కృష్ణమూర్తి. మరోవైపు భర్త అత్త మాట్లాడుకున్న మాటలు జగతికి చెప్పడానికి డిసైడ్ అవుతుంది ధరణి.
 

710

ఈలోగా మిషిన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అత్త, మామ, భర్త. వాళ్ల దగ్గరికి వెళ్లి భోజనం వడ్డించమంటారా అని అడుగుతుంది ధరణి. మహేంద్ర వచ్చాక చేస్తాను ఈ లోపు నేను వీళ్ళతో కాసేపు మాట్లాడాలి నువ్వు వెళ్ళమ్మా, అవసరమైతే పిలుస్తాను అని చెప్తాడు ఫణీంద్ర. వీళ్లు ఇప్పుడప్పుడే వచ్చేటట్లుగా లేరు ఇదే సరైన సమయం అని జగతి దగ్గరికి వెళ్లి మీతో మాట్లాడాలి అని కంగారుగా రూమ్ కి తీసుకువెళ్లిపోతుంది.

810

అప్పుడే వచ్చిన మహేంద్ర, ధరణి కొత్తగా ప్రవర్తిస్తుంది ఏంటి అనుకుంటూ వాళ్లని ఫాలో అవుతాడు. అప్పుడే దేవయాని, ఫణింద్ర మహేంద్ర కి ప్రమాదం తలపెడుతున్నారన్న సంగతి జగతికి చెప్తుంది ధరణి. ఇంతలో మహేంద్ర వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు తప్ప అందరికీ తెలుస్తుంది అంటూ గట్టిగా మాట్లాడుతాడు. గట్టిగా మాట్లాడకండి మావయ్య ఇంట్లో అందరూ వింటారు.
 

910

 మీరు అనుకుంటున్నట్టు శత్రువులు బయట లేరు ఇంట్లోనే ఉన్నారు అంటుంది ధరణి. ఆ మాటలకి ఆశ్చర్యపోయిన మహేంద్ర ఏం మాట్లాడుతున్నావ్ అంటాడు. నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం నేను మహేంద్ర కి నిజం చెప్తాను అని ధరణిని అక్కడి నుంచి పంపించేసి జరిగిందంతా చెప్తుంది జగతి.
 

1010

కోపంతో రగిలిపోతాడు మహేంద్ర శైలేంద్రని నిలదీస్తానంటూ వెళ్ళబోతాడు. ఆ పని మాత్రం చేయకు తన కొడుకే ఇదంతా చేశాడు అంటే బావగారు భరించలేరు. నీ అంతటగా నువ్వు విషయం బయట పెడితే రిషి మీద ఒట్టు. నాకు మీ క్షేమంతో పాటు బావగారి క్షేమం కూడా అవసరం అంటుంది జగతి.

click me!

Recommended Stories