టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కార్తీకేయ 2’ రిలీజ్ తర్వాత నిఖిల్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈక్రమంలో స్పై మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నిఖిల్. యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన స్పై సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.