Karthika Deepam: హిమను చూసి బాధపడుతున్న కార్తీక్, దీప.. అంజి పండరీ కొడుకని తెలుసుకున్న దీప?

First Published Jan 4, 2023, 8:25 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో దీప ఉన్న కొద్ది రోజులు అయినా ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని అనుభవించాలి. ఏ జబ్బు లేనట్టే ప్రవర్తించాలి ఏదో ఒక రోజు ప్రశాంతంగా కన్నుమూయాలి అని అంటుంది దీప. అంతే నేను కోరుకునేది అనడంతో కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు ఆడంతో దోసకాయ పచ్చడి చేస్తున్నాను అని అంటుంది. ఇది హిమకు చేరేలా చేస్తాను అనడంతో ఎలా అని అనగా ఎదురింట్లో మా హేమచంద్ర అన్నయ్య ఉన్నాడు అన్నయ్యకి ఇచ్చాను అంటే చాలు అక్కడికి చేరిపోయినట్టే అనడంతో అక్కడికి పదేపదే వెళ్లొద్దు దీప అంటాడు కార్తీక్. అంత నేను చూసుకుంటాను డాక్టర్ బాబు అని అంటుంది దీప. తర్వాత కార్తీక్ పేస్ట్ ,బ్రష్ తీసుకుని అక్కడికి వచ్చి పేస్ట్ అయిపోయింది అనడంతో ఇంతకుముందు పేస్ట్ అయిపోయినప్పుడు ఎలా చేసేవారు గుర్తుంది కదా ఇప్పుడు అలాగే చేయండి.

 అనగా ఇప్పుడు నన్ను రాయితో కొట్టుకొని తీసుకోమంటావా అనగా అంతే కదా అని అంటుంది దీప. ఇదేం ఆనందం అని సంతోషంగా మాట్లాడుతుంది దీప. అప్పుడు రాయి కోసం కార్తీక్ బయటికి వెళ్ళగా ఇంతలోనే సౌందర్య అంజి అక్కడికి రావడంతో వాళ్లను చూసి ఇంట్లోకి పరుగులు తీస్తాడు కార్తీక్. అప్పుడు సౌందర్య వాళ్లకు ఆ ఇంట్లో ఎవరూ లేరు అని నమ్మించడం కోసం ఇంటి బయట తాళాలు వేసి పక్కకు వెళ్లి దాక్కుంటాడు కార్తీక్. దాంతో సౌందర్య వాళ్ళు అక్కడ ఎవరు లేరు అనుకోని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు దీప ఏంటి బయట గడియ పెట్టారు అని బయటికి రావడంతో అప్పుడు కార్తీక్ వెళ్లి తలుపులు తీస్తాడు. ఏంటి తాళాలు వేశారు అనడంతో అమ్మ వచ్చింది దీప అని అంటాడు కార్తీక్.
 

సమయానికి నేను బయటకు వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇద్దరం దొరికే పోయే వాళ్ళము అని అంటాడు. అప్పుడు సమయానికి పండరి కూడా లేకుండా పోయింది అని కార్తీక్ అనడంతో పండరి ఉన్న కూడా చెప్పదు డాక్టర్ బాబు అనగా, అంజి ఎవరూ కాదు పండరి కొడుకే అనడంతో దీప షాక్ అవుతుంది. రోజు గట్టిగా నిలదీసినప్పుడు తన కొడుకు చూపు ఫోటో చూపించి తన వల్ల ఎంతో నష్టపోయానని కోపంతో మాట్లాడింది దీప అంటాడు కార్తీక్. మరి ఇప్పుడు మారిపోయాడు కదా చెప్పాల్సింది డాక్టర్ బాబు అనడంతో వద్దు దీప పండరి మన గురించి చెప్తే అంజి మమ్మీ వాళ్ళకు చెబుతాడు వద్దు అని అంటాడు కార్తీక్. మరొకవైపు అంజి సౌందర్య మొత్తం ఇళ్లన్నీ వెతికేసాను మేడం ఇక్కడ వాళ్ళు లేరు అనడంతో ఆ ఒక్క ఇల్లు వెతకలేదు కదా అంజి అనడంతో పక్కింటి వాళ్లకు చూపించాను మేడం ఆ ఇంట్లో కూడా అలాంటివారు ఎవరు లేదని చెప్పారు అనడంతో సౌందర్య నిరాశ పడుతూ ఉంటుంది.
 

ఈ ఊర్లో హిమ వాళ్ళను చూసింది కానీ మనం ఎక్కడో మిస్ అయ్యాము అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చారుశీల అక్కడికి రావడంతో ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అనగా ఇక్కడే మా ఇల్లు ఆంటీ అని అంటుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు అనడంతో నా కొడుకు కోడల్ని వెతుక్కుంటూ వచ్చాను అని అనుకుంటూ అని చెబుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప హేమచంద్ర కు దోశలు వేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ హిమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దీప ఒకసారి అత్తయ్య ను ఇక్కడికి పిలుచుకొని రా అన్నయ్య నేను అత్తయ్యతో మాట్లాడాలి అని అంటుంది. నేను చనిపోయిన తర్వాత ఆయన అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వినిపించుకోవడం లేదు మొండిపట్టి పట్టారు ఆ విషయం గురించి నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడాలి అని అంటుంది దీప.
 

 అప్పుడు హేమచంద్ర సరే అని అంటాడు. ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. నేను వస్తాను అంటే నువ్వు ఒంటరిగా బయలుదేరినప్పుడే నాకు అర్థమైంది దీప. ఎందుకు నువ్వు నా మాట వినడం లేదు. నువ్వు లేనిదే నేను లేను అని అంటాడు కార్తీక్. చావైనా బతుకైనా నీతోనే నుంచి వెళ్ళిపోదాం పద అని అంటాడు. అప్పుడు హేమచంద్ర నచ్చజెప్పడానికి ప్రయత్నించిన కూడా కార్తీక్ వినిపించుకోకుండా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, దీపను అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుండగా ఇంతలో హిమ రావడంతో పక్కకు వెళ్లి దాక్కుంటారు. అప్పుడు హిమ అక్కడికి వచ్చి అంకుల్ సౌర్య మీరు అమ్మానాన్నలను వెతకడానికి వెళ్తున్నారు కదా నన్ను కూడా పిల్చుకెళ్ళండి పక్కనే ఉన్న కార్తీక్, దీప బాధపడుతూ ఉంటారు.
 

 అప్పుడు హిమను దోసకాయ పచ్చడి దోసె తినడానికి పిలుచుకొని వెళ్తాడు హేమచంద్ర. మరొకవైపు సౌందర్య ఆనందరావు దంపతులు దీప వాళ్ళ గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. మరొకవైపు హిమ, హేమచంద్ర ఇద్దరూ దోస తినాలని కూర్చుంటారు. అప్పుడు దోసకాయ పచ్చడి తిని హిమ దీపను తలుచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా అది చూసి కార్తీక్, దీప ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత హిమ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్, దీప బయటికి వస్తారు. చూసావా హేమచంద్ర ఎంత టెన్షన్ పడ్డామో దీప ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప సరే డాక్టర్ బాబు మీరు ఎక్కడికి వెళ్లొద్దండి ఉన్నన్నాళ్ళు నాతోనే సంతోషంగా ఉండండి అని అంటుంది.

click me!