దీనికి కొనసాగింపుగా రోజా మాట్లాడుతూ.. అది కిచెన్ లో వచ్చే రొమాంటిక్ సీన్. నన్ను శ్రీకాంత్ గారు వెనకనుంచి వచ్చి కౌగిలించుకుని డైలాగులు చెప్పాలి. నన్ను కౌగిలించుకున్న వెంటనే డైలాగ్ మరచిపోతున్నారు. అందుకే 27 టేకులు అవసరం అయ్యాయి అని రోజా తెలిపింది.
హైపర్ ఆది సెటైర్లు వేస్తూ.. ఆయన దగ్గరకి రాగానే మీరు అన్నయ్య అని పిలిచి ఉంటారేమో.. అందుకే డైలాగులు మరచిపోయారు అని ఫన్నీగా తెలిపాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి చిత్రంలో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ, ప్రీతా ప్రధాన పాత్రల్లో నటించారు.