2000 సంవత్సరం తర్వాత టాలీవుడ్ లో చాలా మంది కొత్త హీరోలు ఫేమస్ అయ్యారు. అప్పటి వరకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య లాంటి సీనియర్ హీరోల హవానే ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు యువతలో పాపులారిటీ సొంతం చేసుకోవడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి హిట్స్ తో రోహిత్ కూడా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
25
కంటతడి పెట్టించే పాత్రలో రోహిత్
మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న అందగాడిగా రోహిత్ కి యువతలో పాపులారిటీ దక్కింది. చిరంజీవితో కలసి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో కీలక పాత్రలో రోహిత్ నటించారు. ఈ మూవీలో రోహిత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆడియన్స్ కి కంటతడి పెట్టించేలా సీన్లు ఉంటాయి.
35
ఆడియో క్యాసెట్ దొరికేది కాదు
రోహిత్ నటించిన దాదాపు అన్ని సినిమాలో ఆడియో ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. రోహిత్ బొమ్మ కనిపిస్తే చాలు ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడయ్యేవి. కానీ సడన్ గా రోహిత్ టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యారు. ఎవరో కుట్ర చేసి రోహిత్ ని తొక్కేయలేదు. తాను చేసిన తప్పిదం వల్లే సినిమా అవకాశాలు తగిపోయాయి అని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.
హీరోగా నాకు మంచి క్రేజ్ వచ్చింది. నా సినిమాలో పాటల బావుంటాయి అందరిలో నమ్మకం ఏర్పడింది. వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ విషయంలో కఠినంగా వ్యవహరించడం ప్రారంభించా. నా మనసుకు స్క్రిప్ట్ నచ్చకపోతే దర్శకుల ముఖం మీదే చెప్పేసేవాడిని. అలోచించి నా నిర్ణయం చెబుతా అని అనేవాడిని కాదు. అలా చెబితే వాళ్ళు నా కోసం ఎదురుచూడడం, టైం వేస్ట్ కావడం జరుగుతుంది.
55
అందువల్లే ఇండస్ట్రీకి దూరమయ్యా
నచ్చకపోతే వెంటనే నో చెబితే మరో వర్క్ ని వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. మంచి కోసం తీసుకున్న ఆ నిర్ణయమే నాకు శాపంగా మారింది. అప్పటి వరకు చాలా మంది దర్శకులు నిర్మాతలు నాతో సినిమా చేయాలని ఎగబడేవారు. కానీ స్క్రిప్ట్ బాగాలేదని నేను ముఖం మీదే చెప్పడంతో కొందరు హర్ట్ అయ్యారు. నా గురించి నెగిటివ్ గా చెప్పడం ప్రారంభించారు. అది నాకు మైనస్ అయింది అని రోహిత్ పేర్కొన్నారు. ఆ మధ్యన రోహిత్ ఓ మూవీ ఈవెంట్ లో కనిపించినప్పుడు చిరంజీవి కూడా గుర్తు పట్టలేకపోయారు. రోహిత్ నువ్వా.. చాలా రోజుల తర్వాత చూడడంతో గుర్తుపట్టలేకపోయా అని చిరంజీవి ఆ ఈవెంట్ లో అన్నారు.