వీరగా నటించిన పవన్ కళ్యాణ్, ఔరంగజేబ్గా నటించిన బాబీ డియోల్ ఎదురుపడటంతో మొదటి భాగం ముగుస్తుంది. ఆ ఎదురుపడే సీన్ పీక్లో ఉంటుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చోటు చేసుకునే యుద్ధమే రెండో పార్ట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.
అయితే ఈ రెండో పార్ట్ కి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ కూడా వెల్లడించింది టీమ్. ఇప్పటికే 20 నుంచి 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్.
ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు. రెండో భాగం ఉంటుందా? లేదా అనేది మొదటి పార్ట్ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.
సినిమా బాగా ఆడితే కొనసాగిస్తామని, లేదంటే ఉండబోదనే విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేశారు. కానీ చూడబోతుంటే రెండో పార్ట్ రావడం కష్టమే అని చెప్పొచ్చు.