ఇది చూసిన రాధాకృష్ణ ఓ సారి ఆయన్ని ప్రశ్నించారు. సీఎంగా దిగిపోయినప్పుడు ఆయన్ని కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రశ్నించారట. ఎందుకు ఈ కల్చర్ని పాటిస్తున్నారు , అది మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా అని అడగ్గా,
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, అలా చేయడానికి బలమైన కారణం ఉంది. ఎవరికి వారు స్వతహాగా నా కాళ్లు మొక్కేవాళ్లు, నన్ను అభిమానించేవారు,
నేను చూస్తున్నానని చెప్పి వచ్చిన వారు దొంగలు. నేను చూసినా రాని వాడు నిజమైన నాయకుడు అని భావించేవారట. ఆ లెక్కన కార్యకర్తలను, లీడర్లని అంచనా వేసేవారట రామారావు.
ఈ లాజిక్ విని రాధాకృష్ణకి మతిపోయింది. ఈ విషయాన్ని రాధాకృష్ణ.. నటుడు శరత్ కుమార్ ని ఇంటర్వ్యూ చేసే సమయంలో తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది, దాన్ని రామారావు ఇక్కడ కూడా పాటించారని చెబుతూ, ఈ సంఘటన పంచుకున్నారు ఆర్కే.