Guppedantha Manasu: చీకటి గదిలో రిషి, వసు.. ఏం చేస్తున్నారు అంటూ షాక్ ఇచ్చిన గౌతమ్!

First Published Jan 29, 2022, 12:00 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ మొదటి స్థానాల్లోనే ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

జగతి (Jagathi) తన దగ్గరకి రావటంతో మహేంద్ర వర్మ ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతాడు. రిషి.. ముందే ఈ విషయాన్ని చెబితే బాగుండేది.. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే నా కళ్ళతో చూసి మురిసి పోయేవాడిని అంటూ.. ఈ సంక్రాంతికి రిషి (Rishi) గొప్ప గిఫ్ట్ ఇచ్చాడని అంటాడు.
 

ఇక జగతి కూడా మహేంద్ర వర్మను (Mahendra Varma) అలాగే చూస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడకు ధరణి వచ్చి.. మిమ్మల్ని ఇలా చూస్తే సంతోషంగా ఉంది అంటూ.. కానీ పెద్ద అత్తయ్య కోపం చూస్తుంటే భయమేస్తుందని అంటుంది. ఇక పెద్దమామయ్య కూడా వచ్చాడు అని చెబుతుంది ధరణి (Dharani).
 

మరోవైపు వసు (Vasu).. గౌతమ్, రిషి లతో.. గొబ్బెమ్మ లేనిదే ముగ్గు విలువ లేదు అంటూ.. ఆవు పేడ ఎవరు ముందు తెస్తారో వాళ్లకు గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది. ఇక దానికి ఇద్దరు సైకిల్ పై బయలుదేరుతారు. ఇక ఇంట్లో జగతి, దేవయాని వాళ్ళు ఒకే చోట ఉంటారు. వెంటనే దేవయాని (Devayani) కోపంతో రగిలిపోతూ ఫణీంద్ర వర్మతో ఈ టాపిక్ ను పెద్ద చేయాలని చూస్తుంది.
 

ఇక జగతి (Jagathi) కూడా దేవయానిపై కాస్త గట్టిగానే మాట్లాడుతుంది. ఇక దాంతో అక్కడ కాసేపు మాటల యుద్ధం బాగా జరుగుతుంది. వెంటనే ఫణీంద్ర వర్మ జగతికి సపోర్టుగా మాట్లాడుతాడు. అయినా కూడా దేవయాని (Devayani) తన మాటలతో బాగా రెచ్చిపోతుంది. 
 

ఇక జగతి (Jagathi) ఎమోషన్ అవుతూ ఉండగా ఫణీంద్ర వర్మ ఓదారుస్తాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఫణీంద్ర వర్మ జగతి వాళ్లకు బట్టలు తీసుకొని వస్తాడు. అది చూసిన దేవయాని (Devayani) తట్టుకోలేకపోతుంది. తరువాయి భాగం లో పండగ సందర్భంగా భోగిమంటలు వేస్తారు.
 

ఇక రిషి (Rishi) స్టోర్ రూమ్ లో ఉన్న పాత వస్తువులు తీసుకొని రావడానికి వెళ్లగా వసు కూడా రిషితో వెళుతుంది. వసు కు అక్కడ ఏదో గుచ్చుకోవటం తో వెంటనే రిషి తన వేలు నోట్లో పెట్టుకుంటాడు. ఆ సమయంలో గౌతమ్ (Gautham) వచ్చి.. ఈ చీకటి గదిలో మీరు ఏం చేస్తున్నారు అని అనడంతో వాళ్లు వెంటనే షాక్ అవుతారు.

click me!