చిరంజీవి ఎక్కువగా భయపడేది దేనికో తెలుసా? నాన్న దెబ్బలు, మాస్టర్ బెత్తానికి కాదు
Chiranjeevi: చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్గా రాణిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఇమేజ్ క్రేజ్ ఆయన సొంతం. అలాంటి చిరంజీవి ఓ విషయంలో భయపడతాడట. అదేంటో చూద్దాం.
Chiranjeevi: చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్గా రాణిస్తున్నారు. ఇప్పటికీ ఆ ఇమేజ్ క్రేజ్ ఆయన సొంతం. అలాంటి చిరంజీవి ఓ విషయంలో భయపడతాడట. అదేంటో చూద్దాం.
Chiranjeevi: చిరంజీవి గత నాలుగున్నర దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా టాలీవుడ్లో మెగాస్టార్గా వెలుగొందుతున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. కొత్త జనరేషన్తో ఆయన పోటీ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఆయన దేనికి ఎక్కువగా భయపడతారో వెల్లడించారు.
చిరంజీవి చిన్నప్పుడు తన నాన్న చేతి దెబ్బలకు భయపడేవాడట. నాన్న బాగా కొట్టేవాడట. నాగబాబు కూడా పలు సందర్భాల్లో తెలిపారు. ఆ స్టేజ్ దాటి వచ్చిన చిరు.. మాస్టార్ బెత్తానికి భయపడ్డాడట. చదువుకునే రోజుల్లో అవి కామన్. మెగాస్టార్కి కూడా అవి తప్పలేదు. అయితే ఓ దశ దాటిన తర్వాత సినిమాల్లోకి వచ్చాక అవన్నీ లైట్. జీవితంలో ఒకటి సాధించిన తర్వాత భయపడే అంశాలు పెద్దగా ఉండవు.
కానీ చిరంజీవికి సక్సెస్ అయిన తర్వాతనే అసలు భయం స్టార్ట్ అయ్యిందట. ఆ భయమే తనని ఎక్కువగా వెంటాడుతుందట. ఆ భయం ఏంటో `రౌడీ అల్లుడు` సినిమా టైమ్లో వెల్లడించారు చిరంజీవి.
ఆయన హీరోగా నటించిన `రౌడీ అల్లుడు` సినిమా వంద రోజుల వేడుకలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఈవెంట్లో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావుల మధ్య సరదా కన్వర్జేషన్ జరిగింది. అలాగే హీరోయిన్ వచ్చీ రాని తెలుగులో మాట్లాడటం నవ్వులు పూయించింది. ఆమెని చిరంజీవి ఆటపట్టించడం హైలైట్గా నిలిచింది.
అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఆయన చెబుతూ, `చిన్నప్పుడు నాన్న చేతులకు భయపడ్డాను. ఆ తర్వాత మాస్టార్ బెత్తానికి భయపడ్డాను. ఎదిగే సమయంలో దేవుడికి, పెద్దలకు భయపడుతూ క్రమశిక్షణతో ఎదుగుతూ వచ్చాను. కానీ ఇప్పుడు అమ్మా నాన్న భయపెట్టరు, దర్శక, నిర్మాతలు భయపెట్టడం లేదు.
కానీ ఇప్పుడు భయపెట్టేది మీ(అభిమానులు) ఈలలు, చప్పట్లు. సాధారణంగా ఈ ఈలలు, చప్పట్లకు ఎవరైనా ఆనందపడతారు, ఉత్సాహపడతారు, రెచ్చిపోతారు, బ్యాలెన్స్ తప్పుతారు. కానీ భయంగా ఉంది. ఇప్పుడు పొందుతున్న ఈ ఆనందం, మీ ఈలలు, చప్పట్లు, అరుపులు, కేరింతలు వచ్చే ఏడాది,
ఆ తర్వాత ఏడాది, ఆ తర్వాత, ఆ తర్వాత ఓపిక ఉన్నంత వరకు ఇంతకి పదింతలు అందించగలరా? అనే భయం ఎక్కువగా ఉంది` అని తెలిపారు చిరంజీవి. అభిమానుల్లో జోష్ నింపేలా ఆరోజు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన `రౌడీ అల్లుడు`(1991) చిత్రంలో దివ్య భారతి, శోభన హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది రిలీజ్ డిలే అవుతుంది.
ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సిన మూవీని ప్రారంభించారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీంతోపాటు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది చిరంజీవి.
also read: `ఆదిత్య 369`లో ఛాన్స్ మిస్ చేసుకున్న బాలయ్య ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా?