Gruhalakshmi: లాస్యకి తోడుగా రాములమ్మ.. విక్రమ్ మీద కంప్లైంట్ చేస్తున్న దివ్య!

Published : Jun 17, 2023, 09:08 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అత్త కోడళ్ళ మధ్య నలిగిపోతున్న సగటు భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Gruhalakshmi: లాస్యకి తోడుగా రాములమ్మ.. విక్రమ్ మీద కంప్లైంట్ చేస్తున్న దివ్య!

ఎపిసోడ్ ప్రారంభంలోనే లాస్య తులసి వాళ్ళతో ఇప్పుడు కోర్టులు,గొడవలు ఎందుకు నేను కేవలం నందు మనసులో చిన్న స్థానాన్ని మాత్రమే కదా అడుగుతున్నాను. అది కూడా ఇవ్వలేకపోతే ఎలాగా నందుకి నచ్చజెప్పితే ఇంకే గొడవలు ఉండవు కదా అని అంటుంది. అప్పుడే వచ్చిన రాములమ్మ ఇందాకటి నుంచి వింటున్నాను లాస్యమ్మగారు అడిగిన దాంట్లో అర్థం ఉన్నాది కదా. అప్పుడు తులసమ్మ గారు నందు బాబు విడిపోయినప్పుడు కూడా మీరు ఏం చేయలేకపోయారు. కనీసం వీళ్ళనైనా కలపండి.

27

తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగితే క్షమించాలి అని అంటుంది. అనసూయ కోపంగా పనిమనిషివి ఇంట్లో విషయాల లో తలదూర్చొద్దు అని చెప్పి పంపించేస్తుంది. వెళ్తూ వెళ్తూ  తప్పు తెలుసుకోండి క్షమించేస్తేనే అందరికీ మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది రాములమ్మ. మరోవైపు రాజ్యలక్ష్మి చేతిని పట్టుకొని విక్రమ్ నొప్పెడుతుందా అమ్మ అని బాధపడుతూ అంటాడు.అప్పుడు రాజ్యలక్ష్మి నాకోసం నువ్వు దివ్యతో గొడవ పెట్టొద్దు. నాకు సారీ చెప్పమని బలవంతం చేయొద్దు మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి కదా అని నటిస్తుంది. 
 

37

అదే సమయంలో అక్కడికి వచ్చిన దివ్య ఏం జరిగింది అని అడుగుతుంది. కోపంలో ఉన్న విక్రమ్, ఏం జరగడం ఏంటి అంత నువ్వే చేశావు వంట చెయ్యను అని చెప్పి అమ్మ మీదకు కత్తి విసిరి చెప్పకుండా పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని తిడతాడు. నేను మీ అమ్మ మీదకి కత్తి విసరలేదు.  నువ్వు ఆవిడ మాటలు నమ్ముతున్నావు కానీ నా మాటలు ఎందుకు నమ్మడం లేదు. నీకు నిజం ఎందుకు కనపడట్లేదు అని అంటుంది. మా అమ్మని అనుమానిస్తున్నావా అని దివ్య మీద చేయి చేసుకోబోతాడు విక్రమ్. అందరి ముందు నా పరువు తీస్తేనే ఆవిడ మనసు చల్లారుతుంది. 

47

నువ్వు కూడా నన్నేదోషిని చెయ్యి ఇంకెన్ని అవమానాలు భరించాలో అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్యలక్ష్మి మనసులో నవ్వుకుంటుంది. మరోవైపు లాస్య రాములమ్మ దగ్గరికి వచ్చి బంగారపు ఉంగరం ఇస్తుంది. ఇప్పటివరకు ఇంట్లో నాకు ఎవరూ తోడు లేరు కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు. నాకోసం నిలబడ్డావు అని అంటుంది. మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు. నేను ఎప్పుడూ తులసమ్మ పార్టీనే కాకపోతే నేను మీ వైపు నిలబడింది మీ మీద ప్రేమతో కాదు నందు బాబు మీద జాలితో. చివరి వరకు ఆయనతోనే ఉండాలి అనుకున్న మీ నిర్ణయం నాకు నచ్చింది.

57

అంతేగాని నా నుంచి ఇంకేం ఆశించొద్దు అని అంటుంది. ఈ మాత్రం సపోర్ట్ చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య. మరోవైపు ప్రియ తులసికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇలాంటి సమయంలో నేను ఉన్నా ఓదార్చలేని పరిస్థితి మీరైనా మాట్లాడండి దివ్యకు ధైర్యం చెప్పండి అని చెప్తుంది ప్రియ. ప్రియ మాటలు విని బాధపడుతుంది తులసి వెంటనే దివ్య కు ఫోన్ చేస్తుంది. దివ్య ఏమీ జరగలేనట్టు సంతోషంగా మాట్లాడుతుంది. కన్నీళ్లు తుడుచుకొని మాట్లాడుతున్నావు కదమ్మా ఎందుకు బాధని దాచుకుంటున్నావు అని తులసి అడుగుతుంది. అందరూ నన్నే దోషగా చూస్తున్నారమ్మ .
 

67

ఆవిడ నా మీద పగ పట్టేసింది. విక్రమ్ కూడా ఆవిడ మాయలోనే పడిపోతున్నారు ఈసారి విక్రమ్ మాట్లాడే వరకు నేను మాట్లాడను అని అంటుంది దివ్య. అలా కాదమ్మా మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకోవద్దు మళ్లీ కొత్త సమస్యలు వస్తాయి అని అనగా ఎందుకమ్మా ఎప్పుడూ అమ్మాయిలే తలదించుకోవాలి. నాకు విక్రమ్ ముందు తలదించుకోవడానికి ఎటువంటి సమస్య లేదు కానీ ఇప్పుడు నేను తలదించితే అత్తయ్య దగ్గర తలదించినట్టు అవుతుంది. ఈ గొడవలో నేను ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ఓడిపోవడం  నీకు కూడా ఇష్టం లేదు. నా సమస్య నేను తేల్చుకుంటాను.
 

77

 ఏడుస్తున్నాను కానీ కృంగిపోవడం లేదు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దివ్య. ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది అని అనుకుంటుంది తులసి. ఆ తర్వాత విక్రమ్ డాబా మీద ఒంటరిగా ఉంటాడు. రాజ్యలక్ష్మి వచ్చి దివ్య ఏది అని అనగా నాకేం తెలుసు  ఎక్కడున్నదో అని అంటాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories