Divvala Madhuri Bigg Boss 9: రెండేళ్లు నరకం చూశా.. మొదటి భర్తని వదిలేయడంపై దివ్వెల మాధురీ ఓపెన్‌ కామెంట్‌

Published : Oct 12, 2025, 09:37 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి సెన్సేషనల్‌ కంటెస్టెంట్‌ దివ్వెల మాధురీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె రెండేళ్ల నరకం గురించి, దువ్వాడ శ్రీనివాస్‌కి ఎందుకు దగ్గరయ్యిందో తెలిపిందే. 

PREV
15
దివ్వెల మాధురీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఐదో వారం ఒక ఎలిమినేషన్‌తోపాటు ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ జరిగాయి. ఇందులో సెన్సేషనల్‌ కంటెస్టెంట్స్ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చారు. అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చింది. ఆమెతోపాటు నటుడు శ్రీనివాసా సాయి, అలాగే నిఖిల్‌ నాయర్‌, అలాగే సోషల్‌ మీడియా, పొలిటికల్‌ సెన్సేషన్‌గా మారిన దివ్వెల మాధురీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీకి సంబంధించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఆదివారం వైల్డ్ కార్డ్స్ ద్వారా దివ్వెల మాధురీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే తాను ఫైర్‌ బ్రాండ్‌ అనే విషయాన్ని చాటి చెప్పింది. అంతేకాదు తన గతాన్ని తలుచుకుంది. ఎంతటి బాధని అనుభవించిందో తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లో తాను దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యిందో, మొదటి భర్తని వదిలేసిందో వెల్లడించింది.

25
దువ్వాడ శ్రీనివాస్‌కి ఎందుకు దగ్గరయ్యిందో తెలిపిన మాధురీ

హౌజ్‌లోకి వచ్చిన దివ్వెల మాధురీ తన అంతరంగాన్ని మొత్తం బయటపెట్టింది. వస్తూ రావడంతోనే తనని తాను ఫైర్‌ బ్రాండ్‌గా ప్రకటించుకుంది. అయితే తనకు ఇంటర్‌లోనే పెళ్లి చేశారట. ఇద్దరు ఆడపిల్లలు ఆరాధ్య, అఖిల జన్మించారని తెలిపింది. అయితే తన మొదటి భర్తతో అండర్‌ స్టాండింగ్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తాయని తెలిపింది. కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించిందట. ఎన్నో ప్రయత్నాలు చేసినా వర్కౌట్‌ కాలేదని, దీంతో విడిపోవాల్సి వచ్చిందని తెలిపింది మాధురీ. కుటుంబం వదిలేశాక, ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో తనలాగే కుటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ దగ్గరయ్యాడని, తనలాగే ఆయన బాధపడుతున్నాడని చెప్పింది. ఇద్దరి బాధలు కలిశాయి. తనకు తోడుగా ఉండేందుకు దువ్వాడ సిద్ధమయ్యాడని తెలిపింది. ఇద్దరం కష్టాల నుంచి కలుసుకున్నామని వెల్లడించింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్‌ అంటే మాధురీ, మాధురీ అంటే శ్రీనివాస్‌ అనేలా ఇద్దరం కలిసిపోయామని, కలిసి ఉంటున్నామని, ఒకరికొకరం అండగా ఉంటున్నామని తెలిపింది.

35
రెండేళ్లు ప్రతి రోజూ నరకం చూశాను

ఈ సందర్భంగా పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది మాధురీ. భర్త నుంచి విడిపోయి, దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యే క్రమంలో చాలా మనోవేదనకు గురయ్యిందట. చాలా మంది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారట. రెండేళ్లపాటు ప్రతి రోజూ నరకం చూశానని తెలిపింది మాధురీ. తనకు వ్యతిరేకంగా చాలా రకాలుగా కామెంట్లు చేశారని, వ్యక్తిత్వ హననం చేశారని తెలిపింది. అలాంటి సమయంలో లైఫ్‌ సెకండ్‌ ఛాన్స్ ఇస్తుందంటారు. తన విషయంలో అదే జరిగిందని, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మాధురీ 2.0ని చూస్తారని తెలిపింది.

45
తనని హేట్‌ చేసేవారికి దగ్గర కావడం కోసం బిగ్‌ బాస్‌ షోకి

బయట తనపై వంద శాతం నెగటివిటీ చూపించేవారని, తనకు అండగా నిలిచేవారే లేరని, వారిని ఒంటరిగా ఎదుర్కొన్నానని, ఒంటరిగా పోరాడానని తెలిపింది. ఈ క్రమంలో 80శాతం ప్రజలు తనని అర్థం చేసుకున్నారు, తన వద్దకు వస్తున్నారు, కలుస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దీంతో తన రియాలిటీ ఏంటో వాళ్లు తెలుసుకున్నారు. ప్రేమిస్తున్నారు. కానీ ఇంకా 20శాతం మంది తనని హేట్‌ చేస్తున్నారు, వాళ్లకి కూడా దగ్గర కావాలి, వాళ్లల్లో కూడా నెగటివిటీ పోగొట్టాలని, అందుకు బిగ్‌ బాస్‌ షో మంచి వేదికగా భావించినట్టు తెలిపింది మాధురీ. ఇందులో తన రియాలిటీ ఏంటో చూపిస్తానని చెప్పింది. మిగిలిన ఆ 20శాతం ప్రజలు కూడా తన రియాలిటీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ జర్నీలో తనని తాను తెలుసుకున్నానని, తనకు నచ్చినట్టు ఉండాలని నేర్చుకున్నట్టు చెప్పింది.

55
దువ్వాడ కోసం ఏమైనా చేస్తా, కంటెస్టెంట్ల రియాలిటీ బయటపెడతా

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇమ్మాన్యుయెల్‌ తప్ప, ఫేవరేట్‌ ఎవరూ లేరని, తాను వెళ్లాక ఆట వేరే లెవల్‌లో ఉంటుందని తెలిపింది మాధురీ. హౌజ్‌లో ఇమ్మూ తప్ప మిగిలిన వారి రియాలిటీ బయటకు రావడం లేదని, మాస్క్ తో ఆడుతున్నారని, వాళ్ల రియాలిటీ బయటపెడతానని తెలిపింది. శ్రీనివాస్‌ కోసం ఏదైనా చేస్తానని తెలిపింది. ఆయన సపోర్ట్ తోనే బిగ్‌ బాస్‌ షోకి వస్తున్నట్టు వెల్లడించింది. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లే ముందు ఆమెకి కన్నడ బిగ్‌ బాస్‌ హోస్ట్ సుదీప్‌ ద్వారా ఒక సూపర్‌ పవర్‌ ఇచ్చారు. గోల్డెన్‌ బజర్‌ని ఇచ్చారు. దీని ద్వారా ఈ వారం డేంజర్‌లో ఉన్నవారిలో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం కలిగి ఉంటుంది. మరి ఆమె ఎవరికి ఉపయోగిస్తుందో చూడాలి. దివ్వెల మాధురీ తన మొదటి భర్తని వదిలేసి ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి దగ్గరయ్యింది. ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదుగానీ, ఇద్దరు భార్యాభర్తలుగానే చెలామణి అవుతున్నారు. వీరి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని కలిగిన మాధురీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఏ మేరకు రచ్చ చేస్తుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories