`కూలీ` సినిమా కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ రెండేళ్లు కష్టపడ్డారట. ఈ రెండేళ్లు కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోలేదట. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇందులో నిమగ్నమైనట్టు తెలిపారు. తపస్సులా పనిచేసినట్టు చెప్పారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ `కూలీ` ఆగస్ట్ 14న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. భారీ కాస్టింగ్తో రూపొందిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మేకర్స్ వెయ్యి కోట్ల కలెక్షన్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి. ఈ మూవీని తెలుగులో ఏసియన్ సునీల్ రిలీజ్ చేస్తున్నారు.
సుమారు రూ.50కోట్లకి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. అంటే వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తే తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అని చెప్పొచ్చు.