తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన భాగ్యరాజ్ ఈరోజు కన్నుమూశారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ డైరెక్టర్ భారతీరాజా మరణించిన 17 రోజులకే ఆయన శిష్యుడు, దర్శకుడు భాగ్యరాజ్ మరణించారు. చెన్నైలో భాగ్యరాజ్ ఆకస్మికంగా మరణించారు. దీనితో కుటుంబ సభ్యులు, సినిమా ప్రముఖుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
24
75 సినిమాల్లో నటుడిగా
భాగ్యరాజ్ దర్శకుడిగా మాత్రమే కాకుండా 75 సినిమాల్లో నటుడిగా కూడా రాణించారు. భారతీరాజా తర్వాత తన సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా సమానమైన పాత్రలు ఇచ్చిన దర్శకుడిగా భాగ్యరాజ్ గుర్తింపు పొందారు.
34
దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా చెరగని ముద్ర
భాగ్యరాజ్ గుండెపోటు కారణంగా ఆకస్మికంగా మరణించారు. భాగ్యరాజ్ 1953లో కోయంబత్తూర్ సమీపంలోని వెల్లంకోయిల్ అనే గ్రామంలో జన్మించారు. దర్శకుడిగా, నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా చెరగని ముద్ర వేశారు.
భాగ్యరాజ్ 1979లో సువరిల్లధ చిత్తిరంగళ్ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ మూవీలో కమెడియన్ సుధాకర్ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. భాగ్యరాజ్ కి శరణ్య భాగ్యరాజ్, శంతను భాగ్యరాజ్ ఇద్దరు పిల్లలు సంతానం. ఆయన దర్శకుడిగా తన చివరి చిత్రాన్ని కొడుకు శంతనుతోనే తెరకెక్కించారు. సిద్దు ప్లస్ 2 అనే చిత్రం 2010లో విడుదలైంది.