రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రానికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్. ఈ మూవీలో అత్యంత కీలకమైన షెడ్యూల్ ని రాజమౌళి రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని 1300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
25
యుద్ధ సన్నివేశాలు
ఈ మూవీలో చిత్రీకరించడానికి అత్యంత కష్టమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రామాయణంలో కుంభకర్ణుడితో జరిగే యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సీన్లు సినిమాలో 25 నిమిషాల నిడివితో ఉంటాయని, మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తాడని రాజమౌళి ఆల్రెడీ ప్రకటించారు. వీటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉంటాయి కాబట్టి గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి షూటింగ్ పూర్తి చేయవచ్చు.
35
కీలకమైన అంటార్కిటికా షెడ్యూల్ రద్దు
అదే విధంగా ఈ చిత్రంలో అంటార్కిటికా సన్నివేశాలు కూడా అత్యంత కీలకం. వారణాసి గ్లింప్స్ లో కూడా అంటార్కిటికా సన్నివేశాలు చూపించారు. ఆ సన్నివేశాలని రాజమౌళి అక్కడే అంటార్కిటికాలో రియలిస్టిక్ గా అద్భుతమైన విజువల్స్ తో చిత్రీకరించాలి అని కలగన్నారు. ఇప్పుడు ఆ కల చిన్నాభిన్నం అయినట్లు తెలుస్తోంది.
అంటార్కిటికాలో షూటింగ్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అక్కడి కఠిన పరిస్థితులని తట్టుకోవాలి. చిత్ర యూనిట్ సేఫ్టీ చాలా ముఖ్యం. రాజమౌళి తలుచుకుంటే ఎంతటి కష్టమైన వదిలిపెట్టరు. కానీ అంటార్కిటికా లో షూటింగ్ కి పరిస్థితులు అనుకూలించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ షెడ్యూల్ ని పలుమార్లు వాయిదా వేశారు. ఇక అక్కడ షూటింగ్ చేయడం కుదరదు అని నిర్మించుకున్న తర్వాత అంటార్కిటికా షెడ్యూల్ ని జక్కన్న రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంటార్కిటికాలో షెడ్యూల్ కోసం మహేష్ బాబు ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుని సిద్ధమయ్యారు. మహేష్ తీసుకున్న ట్రైనింగ్ కూడా ఇప్పుడు వృధానే.
55
రాజమౌళి ప్లాన్ బి
దీనితో రాజమౌళి ప్లాన్ బి అప్లై చేసినట్లు తెలుస్తోంది. అంటార్కిటికా సన్నివేశాలు మొత్తం గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో అంటార్కిటికా సన్నివేశాలని అద్భుతంగా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కానీ అంటార్కిటికా రియల్ లొకేషన్స్ సన్నివేశాల్ని మాత్రం చూడడం సాధ్యం కాదు.